రైతులకు ఎపి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతు దినోత్సవం సందర్భంగా ఖాతాల్లోకి నగదు జమచేయనున్నది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిధులను విడుదల చేయనున్నారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. పంటలకు నష్టపరిహారాలతో పాటుగా, గిట్టుబాటు ధరలను అందించి రైతులను నష్టాల నుంచి గట్టెక్కిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని అందించి ఆదుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు శుభవార్తను అందించింది. రేపే రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రైతుల ఖాతాల్లోకి డబ్బులను విడుదల చేయనున్నారు. రైతు దినోత్సవం సందర్భంగా ఇన్ పుట్ సబ్సిడిని రైతులకు అందించనున్నారు. దీంతో ఎపి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వర్గాల కోసం వినూత్న రీతిలో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు చేయూతనిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ క్రమంలో రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా రైతు దినోత్సవాన్ని జరుపుతున్నారు. ప్రతి ఏటా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదినం రోజునే రైతు దినోత్సవాన్ని జరుపుతుంది ప్రభుత్వం. ఈ సందర్బంగా రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ విడుదల చేయనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తెలిపారు. అనంతపురంలోని కళ్యాణ దుర్గంలో జరిగే సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొని బటన్ నొక్కి రైతులకు ఇన్ పుట్ సబ్సిడీని విడుదల చేస్తారని మంత్రి తెలిపారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు 2022 ఖరీఫ్ కు సంబంధించి ఫసల్ భీమా పథకం కింద రూ.1,016 కోట్లను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.