తెలుగు ప్రజలు సంతోషంగా జరుపుకునే పండగల్లో సంక్రాంతి ఒకటి. సన్నాయి చప్పుళ్లు, గింగిరెద్దుల విన్యాసాలు, కోడిపందెలు. ఇలా చాలా రకాల కార్యక్రమాలతో ప్రజలు అనందంగా సంక్రాంతి పండగను జరుపుకుంటారు. ఇదిలా ఉంటే ఈ పండగ వేళ మద్యం ప్రియులకు పండగనే చెప్పాలి. ఇష్టమొచ్చిన బ్రాండ్ తాగుతూ తాగుబోతులు పండగంటే ఇదేరా అని చెప్పుకుంటుంటారు. ఇకపోతే సంక్రాంతి పండగ నేపథ్యంలో మద్యం ప్రియులకు WHO దిమ్మతిరిగే వార్తను చెప్పింది. అసలు WHO ఏం చెప్పింది. విషయం ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మద్యం తాగే విషయంలో ఇతరుల మాటలు, ప్రకటనలు అస్సలు నమ్మవద్దని WHO తెలిపింది. వారానికి రెండు మూడు సార్లు తగిన మోతాదులో మద్యం సేవించినా.. మొదటికే ప్రమాదమని హెచ్చరికలు జారీ చేసింది. ఒంట్లోకి ఒక చుక్క మద్యం వెళ్లిన క్యాన్సర్ కు దారి తీస్తుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే WHO కొన్ని కీలక అంశాలను ప్రస్తావిస్తూ లాన్సెట్ విశ్లేషణను ప్రచురించడం విశేషం. ఇకపోతే ప్రపంచ వ్యాప్తంగా మిగత మరణాలతో పోలిస్తే.. మద్యం కారణంగానే ఎక్కువ మరణాల కేసులు నమోదు అవుతున్నాయని తెలిపింది. ఇక మద్యం తాగిన వ్యక్తులు అల్కహాల్ కాలిక క్యాన్సర్ బారినపడి చనిపోతున్నారంటూ తెలిపంది.
ఇదిలా ఉంటే 2017లో యూరప్ లో 23వేల మంది క్యాన్సర్ కు గురై చనిపోయారని WHO స్పష్టం చేసింది. ఇదే కాకుండా కాస్ట్లీ, క్వాలిటీ మద్యంలో కూడా క్యాన్సర్ కారకానికి దారి తీస్తుందని తెలిపింది. దీంతో పాటు రేడియేషన్, పొగాకుతో పాటు మద్యం కారణంగా కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం లేకపోలేదని, దీని కారణంగా ఇప్పటికి చాలా మంది చనిపోతున్నారని WHO వివరించింది. అయితే సంక్రాంతి పండగ నేపథ్యంలో చాలా మంది మద్యం ప్రియులు మద్యం తాగేందుకు ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే WHO ఇలాంటి షాకింగ్ న్యూస్ చెప్పడంతో మద్యం ప్రియులు ఒక్కసారిగా షాక్ కు గురువుతున్నారు. WHO ఇటీవల ప్రచురించిన లాన్సెట్ ప్రచురణపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.