వైజాగ్ వివాహిత మహిళ సాయి ప్రియ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెళ్లి రోజున సరదాగా భర్తతో కలిసి బీచ్కి వెళ్లిన సాయి ప్రియ.. అతడు ఫోన్ మాట్లాడ్డానికి పక్కకు వెళ్లగానే.. అక్కడి నుంచి పారిపోయింది. ప్రియుడి వద్దకు వెళ్లింది. సాయి ప్రియ మిస్సింగ్ వార్త తెలియగానే ముందుగా అందరూ ఆమె భర్త శ్రీనివాసరావునే అనుమానించారు. భార్య మీద కోపంతో అతడే ఆమెను ఏమైనా చేసి ఉంటాడు.. లేదంటే సముద్రంలోకి నెట్టి వేసి ఉంటాడు అని భావించారు. విషయం తెలియడంతో పోలీసులు, భద్రతా బలగాలు రంగంలోకి దిగి.. సాయి ప్రియ కోసం గాలింపు మొదలుపెట్టారు. చివరకు ఆమె ప్రియుడి వద్ద ఉందని తెలిసింది. భర్త దగ్గర నుంచి వెళ్లిపోయిన సాయి ప్రియ బెంగళూరు వెళ్లి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంది. తమను వెతకవద్దని.. ప్రియుడితో కలిసి ఉంటానని తెలిపింది. దాంతో పోలీసులు సాయి ప్రియను వైజాగ్ తీసుకువచ్చారు. భర్త రాకపోవడంతో ఆమెను ప్రియుడితో పంపించారు.
ఇక్కడి వరకు కథ బాగానే ఉంది. ఇప్పటికే ఈ మొత్తం వ్యవహారంలో జనాలు సాయి ప్రియ చేసిన పనిని తప్పుపడుతున్నారు. ప్రజా ధనం వృథా చేసిందని విమర్శిస్తున్నారు. ఇక ఈ మొత్తం వ్యవహరంలో సాయి ప్రియ భర్త శ్రీనివాసరావు తీరును ప్రశంసిస్తున్నారు కొందరు. చివరి వరకు అతడు వ్యవహరించిన తీరు.. ఆఖరి నిమిషంలో సాయి ప్రియ నిర్ణయాన్ని గౌరవించిన విధానం అతడెంత గొప్పవాడో తెలియజేస్తుంది అంటున్నారు.
ఇది కూడా చదవండి: సాయి ప్రియ ప్రియుడు రవి తండ్రి బయటపెట్టిన సంచలన నిజాలు!
అవును మరి.. ఈ మొత్తం వ్యవహారంలో బాధితుడు అతడే. తల్లిదండ్రులు చూసిన సంబంధానికి ఓకే చెప్పి వివాహం చేసుకున్నాడు. వారి వివాహం అయ్యి రెండేళ్లు పూర్తయ్యాయి. సాధారణంగా ఇలాంటి వ్యవహారాల్లో చాలా మంది తమ భర్త వేధింపులు భరించలేక ఇలా చేశామని చెప్తారు. కానీ సాయి ప్రియ ఈ రెండళ్ల సమయంలో భర్త శ్రీనివాస్ వల్ల ఇబ్బంది పడినట్లు ఎక్కడా చెప్పలేదు. వేరే వ్యక్తిని ప్రేమించడం వల్లనే వెళ్లిపోయాను అని తెలిపింది.
ఇక సాయి ప్రియ బెంగుళూరు వెళ్లాందని తెలిసినప్పుడు కానీ.. తిరిగి వైజాగ్ వచ్చిన సమయంలో కానీ శ్రీనివాసరావు ఆమె గురించి ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదు. ఇలాంటి సందర్భాల్లో కొందరు… ఇంత జరిగినా పరవు ప్రతిష్ట వంటివి ఆలోచించి.. భార్యను వెంటే తీసుకెళ్తారు. ఇక ఆ తర్వాత వారి జీవితాలు ఎలా ఉంటాయో ప్రత్యేంగా చెప్పాల్సి పని లేదు. కానీ శ్రీనివాసరావు మాత్రం తనకు నష్టం జరిగినా సరే.. సాయి ప్రియ నిర్ణయానికి విలువ ఇచ్చి.. ఆమె ఇష్టం ప్రకారం జీవించేందుకు అంగీకరించాడు. అందుకే పోలీస్ స్టేషన్కు కూడా వెళ్లలేదు. అంతేకాక ఈ మొత్తం వ్యవహారంలో సాయి ప్రియతో పాటు ఆమె తల్లిదండ్రులను కూడా ఒక్కమాట అనలేదు శ్రీనివాసరావు. వారి గురించి ఎలాంటి నెగిటివ్ కామెంట్ చేయలేదు. అతడే కాక.. శ్రీనివాసరావు తల్లిదండ్రులు కూడా ఎక్కడా ఎలాంటి కామెంట్స్ చేయకపోవడం విశేషం.
ఇది కూడా చదవండి: RK బీచ్ నుండి బెంగళూరులో పెళ్లి వరకు ! సాయి ప్రియ కంప్లీట్ స్కెచ్ ఇదే!
భార్యలని కనీసం మనుషులుగా చూడని మగాళ్లు నేటికి మన సమాజంలో ఎందరో ఉన్నారు. చిన్న చిన్న విషయాలకే వారిని అనుమానించి.. నిత్యం వేధించి నరకం చూపించే వారి మధ్య శ్రీనివాసరావు లాంటి వాళ్లు కూడా ఉండటం నిజంగా గొప్ప విషయం అంటున్నారు ఈ మొత్తం వ్యవహారం చూసిన వాళ్లు. మరి దీనిపై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: వైజాగ్ బీచ్ వివాహిత మిస్సింగ్ కేసు: ప్రియుడిని పెళ్లి చేసుకున్న సాయిప్రియ!