ఏపీలో సినిమా రంగానికి ప్రభుత్వానికి ప్రత్యక్షంగానో- పరోక్షంగానో ఏదో ఒక సమస్య నడుస్తూనే ఉంది. తాజాగా విజయవాడ మేయర్ ఇచ్చిన నోటీసుతో పెద్ద చర్చే మొదలైంది. అదేంటంటే.. కొత్తగా వచ్చే ప్రతి సినిమాకి షోకి వంద టికెట్లు మేయర్ ఆఫీసుకు పంపాలట. అందుకు సంబంధించిన రుసుము చెల్లిస్తారంటా. ఆ విషయంపై ఇప్పుడు ఏపీలో పెద్ద చర్చే నడుస్తోంది.
ఇదీ చదవండి: సీఎం KCR ఆరోగ్యం గురించి డాక్టర్స్ ఏమి చెప్పారంటే?
అసలు విషయం ఏంటంటే.. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు ప్రతి కొత్త సినిమాకి మేయర్ కార్యాలయానికి వచ్చి టికెట్లు అడుగుతున్నారంట. అది వారి కోసమో.. వారి వెనుక తిరిగే కార్యకర్తల కోసమో క్లారిటీ లేదు గానీ. టికెట్ల కోసం మాత్రం ప్రజాప్రతినిధులు ఇబ్బంది పడుతున్నారంట. అది మేయర్ దృష్టికి వచ్చి ఏకంగా విజయవాడ కార్పొరేషన్ పరిధిలో ఉన్న మాల్స్ లోని థియేటర్ యజమానులకు ఒక నోటీసు ఇచ్చారు.
‘విజయవాడ కార్పొరేషన్ పరిధిలో నెలకు చాలా కొత్త సినిమాలు విడుదల అవుతున్నాయి. కొత్త సినిమాల టికెట్ల కోసం ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు అభ్యర్థిస్తున్నారు. వారి విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుని.. మాల్స్ లో విడుదల అవుతున్న ప్రతి కొత్త సినిమాకి సంబంధించి ప్రతి షోకి 100 టికెట్లను మేయర్ కార్యాలయానికి పంపాలి. అలా పంపిన టికెట్ల ఛార్జీలను నగదు రూపంలో చెల్లిస్తాం’ అంటూ అధికారికంగా నోటీసు పంపారు. కార్యకర్తలు, ప్రజాప్రతినిధులకు సినిమా టికెట్లు కావాలని మేయర్ ఇలా రిక్వెస్ట్ చేయడంపై సర్వత్రా అభ్యంతరాలు వ్యక్త మవుతున్నాయి. మరి, విజయవాడ కార్పొరేషన్ మేయర్ ఇలా రిక్వెస్ట్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.