ఈ భూమి మీద తల్లి ప్రేమకు మించినది మరొకటి లేదు. అలానే ఈ భూలోకంలో ఏమి ఆశించకుండా మనుపై ప్రేమ చూపే వ్యక్తి తల్లి ఒక్కరే. తన సుఖాలను వద్దులుకుని బిడ్డల సంతోషం కోసమే అమ్మ ఆరాటపడుతుంది. అలా చిన్నతనంలో తనకు నీడ నిచ్చిన తల్లికే.. ఓ కుమారుడ నీడలేకుండా చేశాడు. ఆమె ఉండే ఇంటిని కూల్చేశాడు ఆ పుత్రరత్నం.
ఈ భూమి మీద తల్లి ప్రేమకు మించినది మరొకటి లేదు. అలానే ఈ భూలోకంలో ఏమి ఆశించకుండా మనపై ప్రేమ చూపే వ్యక్తి తల్లి ఒక్కరే. తన సుఖాలను వద్దులుకుని బిడ్డల సంతోషం కోసమే అమ్మ ఆరాటపడుతుంది. బిడ్డలను కంటికి రెప్పల కాపాడుకుంటూ.. ఓ చిన్న కష్టం వచ్చిన అల్లాడిపోతుంది. అలా తాను కష్టాలు పడుతూ బిడ్డలను పెంచి పెద్ద చేసి.. ఓ ఇంటి వారిని చేస్తుంది. ఇలా తమ జన్మకు కారణమైన తల్లిపై కొందరు బిడ్డలు కర్కశత్వం ప్రదర్శిస్తారు. గోరు ముద్దలు పెట్టిన తల్లికి ముద్ద అన్నం పెట్టకుండా హింసిస్తారు. చిన్నతనంలో తమ నీడగా నిలిచిన అమ్మకు.. వృద్ధాప్యంలో నిలువు నీడ లేకుండా చేస్తున్నారు. తాజాగా ఓ కుమారుడు అలాంటి ఘోరానికే పాల్పడ్డాడు. కుమార్తెకు ఆస్తి రాసిచ్చిందనే కోపంతో తల్లి ఇంటిని కూల్చేశాడు. ఈ దారుణమైన ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది పూర్తి వివరాల్లోకి వెళ్తే..
అనకాపల్లి జిల్లా మునగపాక మండలం రాజుపేటకు చెందిన నాగమ్మ అనే 68 ఏళ్ల వృద్ధురాలు డాబా ఇంటిలో ఒంటరిగా నివాసం ఉంటుంది. ఆమెకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారందరికి వివాహలయ్యాయి. ఎవరి కుటుంబాలతో వారు నివాసం ఉంటున్నారు. నాగమ్మ మాత్రం ఒంటరిగా జీవనం సాగిస్తుంది. కని పెంచిన కుమారులు ముగ్గురు నాలుగేళ్లుగా ఆమె ఆలనాపాలనా చూడటం లేదు. కుమార్తెలో ఒకరైన రమణమ్మ.. తల్లి బాగోగులు చూసుకుంటోంది.
దీంతో తన తదనంతరం తానుండే ఇంటిని కుమార్తె రమణమ్మకే చెందేలా నెల క్రితం నాగమ్మ రిజిస్ట్రేషన్ చేసింది. అయితే ఆ విషయంలో కుమారులో ఒకరైన తాతారావుకు తెలిసింది. దీంతో కొడుకు, మనుమడు శ్రీను కలసి మార్చి 12న పొక్లెయిన్ తో నాగమ్మ ఇంటికి వచ్చారు. ఆమెతో కాసేపు వాగ్వాదం జరిపి.. అనంతరం నాగమ్మ ఉండే ఇంటిని పొక్లెయిన్ తో కూల్చేశారు. వృద్దాప్యంతో బాధపడుతున్న తనకు నిలువ నీడ లేకుండా చేశారని ఆమె వాపోయింది. తనకు న్యాయం చేయాలంటూ కుమార్తె రమణమ్మతో కలసి మనుగపాక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలానే ఎమ్మార్వోకు సైతం నాగమ్మ తన బాధను వ్యక్తం చేసి.. ఫిర్యాదు చేశారు.
అయితే ఫిర్యాదు చేసిన అధికారులు ఎవ్వరూ పట్టించుకోలేదని నాగమ్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై మీడియా మునగపాక ఎస్సై మహమ్మద్ ఆలీని వివరణ కోరగా.. స్పందించారు. ఇంటిని కూల్చివేతపై ఫిర్యాదు అందిందని, కుటుంబ సభ్యులతో చర్చించుకుంటామని నాగమ్మ కొడుకులు తెలపడంతో కేసు నమోదు చేయలేదని ఆయన తెలిపారు. మరి.. చిన్నతనంలో నీడ నుంచి తల్లికే.. వృద్ధాప్యంలో నిలువు నీడలేకుండా చేశారని స్థానికులు అంటున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.