ఈ మధ్యకాలంలో వరదల దాటికి చెరువులు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. కొన్ని చోట్ల అయితే రోడ్లు నదులను తలపిస్తున్నాయి. కొన్నిచోట్ల వాహనాలు వరదల్లో చిక్కుకుని చాలా మంది గల్లంతయ్యారు. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా హిందుపూరం మండలంలో ఓ ప్రైవేటు బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. హిందుపూరం నుంచి గోరంట్ల వైపు వెళ్తున్న ప్రైవేటు బస్సు.. కోట్నూరు చెరువు నీటి ఉద్ధృతికి ఓ పక్కకు ఒరిగింది. దీంతో సమయస్ఫూర్తితో డ్రైవర్.. బస్సును నిలిపివేశాడు. హిందుపూరం నుంచి గోరంట్ల వైపు ఓ కంపెనీకి చెందిన బస్సు 40 కార్మికులతో బయలు దేరింది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు వరద నీటిలో ఈ బస్సు ఒ పక్కకు ఒరిగింది. అప్రమత్తమైన కార్మికులు ప్ వెంటనే బస్సులో నుంచి దిగేశారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సాయంతో బస్సును బయటకి తీసి పంపించారు.
ఇదీ చదవండి: భార్యను సుత్తితో కొట్టి చంపిన భర్త! ఎందుకో తెలుసా?
ఇదీ చదవండి: ఆత్మహత్య చేసుకుంటా అంటూ స్కూల్ బిల్డింగ్ ఎక్కిన విద్యార్థిని.. చివరికి..