అన్నమయ్య జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ భర్త కసాయిగా మారి ఏకంగా కట్టుకున్న భార్యను దారుణంగా హతమర్చాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లి తండాలో శాంతమ్మ, మునిరెడ్డి అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి పదేళ్ల కిందట వివాహం జరిగింది. అయితే పెళ్లైన కాలం నుంచి విరిద్దరూ తరుచు గొడవలు పడుతుండేవారని స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే బుధవారం రాత్రి మద్యం మత్తులో భార్యాభర్తలు మరోసారి గొడవకు దిగినట్లు తెలుస్తోంది. దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడికి దిగారు. ఇక కోపంతో ఊగిపోయిన భర్త మునిరెడ్డి ఇంట్లో ఉన్న సుత్తితో భార్య తలపై దారుణంగా దాడి చేశాడు. ఈ దాడిలో భార్య శాంతమ్మ రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తెల్లారేసరికి ఇంట్లో శాంతమ్మ శవమై కనిపించడంతో స్థానికులు అంతా ఒక్కసారిగా ఖంగుతున్నారు. ఈ ఘటనపై వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం చేశారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం భర్త మునిరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే శాంతమ్మ హత్యకు భార్యాభర్తలు మద్యం మత్తులో కారణంగానే ఈ దారుణం జరిగిందని స్థానికులు అనుమానిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ దారుణ ఘణనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: పెళ్లికి ఒప్పుకోని యువతి.. యువకుడు ఏం చేశాడంటే!