రోడ్డు ప్రమాదల కారణంగా ఎన్నో కుటుంబాలు ఆధారాలను కోల్పోతున్నాయి. నిర్లక్ష్యం, అతివేగం, మద్య తాగి వాహనం నడపడం వంటి ఇతర కారణాలతో రోడ్డు ప్రమాదాలు ఎక్కవగా జరుగుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. అయినా తరచూ ప్రమాదాలు చోటుచేసుకుని అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో ఓ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు తీవ్రగాయాలతో చాలా దుర్భర స్థితిలో కాలాన్ని గడుపుతున్నారు. అతివేగం, మద్యం తాగి వాహనం నడపటం, నిద్రమత్తు, నిర్లక్ష్యం వంటి ఇతర కారణాలతో ఈ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా తెల్లవారు జాము సమయంలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రానైట్ రాళ్ల లోడుతో వెళ్తున్నారు టిప్పర్.. అదుపుతప్పి రోడ్డుపై బోల్తా కొట్టింది. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో అందులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మరి.. వారికి ఏమైంది.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
గత కొంతకాలం నుంచి ప్రకాశం జిల్లా చీమకుర్తి నుంచి రామాయపట్నం ఓడరేవు నిర్మాణానికి టిప్పర్ల ద్వారా గ్రానైట్ రాళ్లు తరలిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం కూడా కొన్ని టిప్పర్ల గ్రానైట్ రాళ్లను రామాయపట్నం ఓడరేవుకు తీసుకెళ్తున్నాయి. అలా గ్రానైట్ రాళ్ల లోడుతో వెళ్తున్న ఓ టిప్పర్ చేవూరి రహదారిపై అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో గ్రానైట్ రాళ్లు చెల్లాచెదురుగా పడిపోయాయి. పెద్ద శబ్దం రావడంతో సమీపంలో ఉన్న వారు అక్కడి చేరుకున్నారు. అయితే ఈ ప్రమాదంలోఎవరికి గాయాలు కాకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. చీమకుర్తి నుంచి నిత్యం 300కు పైగా టిప్పర్లు గ్రానైట్ రాళ్లతో మొండివారిపాలెం వద్ద ఓడరేవు నిర్మాణానికి వెళ్తుంటాయి.
రహదారి ఇరుకుగా ఉండటంతో ఎదురుగా వాహనాలు వస్తే పక్కకు తొలగాల్సి వస్తుంది. అలా పక్కకు జరిగే సమయంలో రోడ్డు అంచుకు వచ్చి.. టిప్పరు బోల్తా పడిందని స్థానికులు అంటున్నారు. ఆ సమయంలో రహదారిపై ఇతర వాహనాలు, జనాలు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేశారు. టిప్పర్లు అధిక బరువుతో పాటు వేగంగా రాకపోకలు చేస్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.