పొద్దున్నే వల భుజానేసుకుని గంగమ్మతల్లికి నమస్కరించి చేపల వేటకు వెళ్లే జాలరులకు ఆ రోజు చేపలు చిక్కితేనే రోజు గడుస్తుంది. అదే జీవనాధారంగా బ్రతుకుతున్న జాలరులకు ఈ మధ్య కొన్ని అరుదైన చేపలు వలలో చిక్కుతున్నాయి.. ఆ చేపలు లక్షల ధర పలుకుతున్నాయి. దీంతో జాలర్ల దశ తిరిగిపోతుంది. ఓ జాలరికి అరుదైన చేప చిక్కింది.. దాని విలువ లక్షలు పలికింది.. వివరాల్లోకి వెళితే..
ఆదివారం ఓ జాలరికి 23 కిలోల మగ కచ్చిడీ చేప చిక్కడంతో అతని పంట పండింది. సాధారణంగా వేలు సంపాదించేవారు ఇలాంటి చేపలు పడితే లక్షల్లో సంపాదిస్తారు. కచ్చిడీ చేపను చేపల మార్కెట్కు తెచ్చి వేలం వేశాడు. దాన్ని ఓ వ్యక్తి రూ.2 లక్షలు చెల్లించి తీసుకున్నాడు. మగ కచ్చిడి చేపలు కొనేందకు వ్యాపారులు విపరీతంగా పోటీ పడతారు. మరి ఆ చెపకు ఎందుకు అంత డిమాండ్ అనుకుంటున్నారా? ఈ కచ్చిడీ కేవలం రుచికే కాదు.. ఔషధంగా కూడా పని చేస్తుంది అంటున్నారు మత్స్య కారులు.
కచ్చిడి చేప ఎన్నో రకాలుగా ఉపయోగిస్తుంటారు. దీని పొట్టలోని తిత్తులు ఔషధాల తయారీలో ఉపయోగిస్తారని.. అందుకే అంత ధర ఉంటుందని వ్యాపారాలు చెబుతారు. అంతేకాదు సర్జరీ చేశాక కుట్లు వేసే దారాన్ని ఈ చేప గాల్ బ్లాడర్తో తయారు చేస్తారని తెలుస్తుంది. ఇలాంటి చేపలు మత్స్యకారులకు చిక్కితే గోల్డెన్ చేప చిక్కినట్లు భావిస్తుంటారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Chittoor: రైతన్నకు ఎంత కష్టం వచ్చింది.. కుమారులనే కాడెద్దులుగా మార్చి!