పుల్లారెడ్డి స్వీట్స్ గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్వీట్స్ లో తమకంటూ ఓ బ్రాండ్ ను ఏర్పాటు చేసిన సంస్థ.. పుల్లారెడ్డి స్వీట్స్. దేశ వ్యాప్తంగా అనేక బ్రాంచ్ లు సైతం ఈ సంస్థకు ఉన్నాయి. అలానే పలు ఇంజినీరింగ్ విద్యాసంస్థలు సైతం పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని జి.రాఘవరెడ్డి నడుపుతున్నారు. ఇది ఇలా ఉంటే.. ఇటీవల కొంతకాలం క్రితం కోడలు ప్రజ్ఞారెడ్డి ఇష్యూతో పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని వార్తల్లో నిలిచారు. తాజాగా ఈ కుటుంబ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని రాఘవరెడ్డి, ఆయన భార్య భారతి రెడ్డి, కుమార్తె శ్రీ విద్యారెడ్డిల నుంచి తనను కాపాడాలంటూ ఆయన కోడలు ప్రజ్ఞారెడ్డి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ప్రస్తుతం వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పుల్లారెడ్డి స్వీట్స్ వ్యవస్థాపకుడు జి.పుల్లారెడ్డి కుమారుడు రాఘవరెడ్డి. ప్రస్తుతం ఆయన పుల్లారెడ్డి గ్రూప్ వ్యవహారాలు చూసుకుంటున్నారు. ఆయనకు ఏక్ నాథ్ రెడ్డి, శ్రీ దివ్యా అనే పిల్లలు ఉన్నారు. కుమారుడు ఏక్ నాథ్ రెడ్డికి మైనింగ్ వ్యాపారి అయినా కేఆర్ఎం రెడ్డి కుమార్తె ప్రజ్ఞారెడ్డితో వివాహం జరిపించారు. అయితే పెళ్లైన కొన్నాళ్లకు వారిద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. భర్త ఏక్ నాథ్ రెడ్డి, అత్తమామలు వేధింపులకు గురిచేస్తున్నాంటూ ప్రజ్ఞారెడ్డి గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో పుల్లారెడ్డి కుటుంబ సభ్యులపై పంజాగుట్ట పీఎస్ లో గృహహింస చట్టం కింద కేసు కూడా నమోదైంది.
తాజాగా భారత రాష్ట్రపతికి లేఖ రాయడంతో పుల్లారెడ్డి కుటుంబం మరోసారి తెరపైకి వచ్చింది. డిసెంబర్ 29న రాష్ట్రపతి ముర్ము నారాయణమ్మ కాలేజీని సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రజ్ఞ రెడ్డి రాష్ట్రపతికి లేఖ రాయడం సంచలనంగా మారింది. వరకట్నం కోసం తనని హింసించారని ప్రజ్ఞారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా లేఖలో పలు విషయాలను ఆమె వివరించారు. రాఘవరెడ్డి, ఆయన భార్య భారతి, కుమార్తె శ్రీవిద్యా గత రెండేళ్లుగా తనను, తన కుమార్తెను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని ప్రజ్ఞా ఆరోపించారు. గతంలో తనను వరకట్నం కోసం హింసించారని, తనను, తన కుమార్తెను చంపేందుకు ప్రయత్నించారని తన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.
తనను గదిలోంచి బయటికి రానివ్వకుండా రాత్రికి రాత్రే గోడ కట్టేశారని వివరించారు. కోర్టు స్పందించి, ఆ గోడ కూల్చేయాలని చెప్పిందని ప్రజ్ఞారెడ్డి వివరించారు. ఓ మహిళగా సాటి మహిళ వేదనను అర్థం చేసుకుంటారన్న ఆలోచనతో మీకు ఈ లేఖ రాస్తున్నాను. “నాకు, నా బిడ్డకు న్యాయం చేయండి.. మేడమ్” అంటూ ప్రజ్ఞారెడ్డి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విజ్ఞప్తి చేశారు. మరి..ఈ లేఖపై రాష్ట్రపతి ముర్ము ఏ విధంగా రెస్పాండ్ అవుతారో చూడాలి. మరి.. ఈ పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని కోడలు రాష్ట్రపతికి రాసిన లేఖపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.