తగిలిన గాయం మీదనే మళ్లీ గాయంమైనట్లు ఉంది నెల్లూరు, చిత్తూరు జిల్లా వాసుల పరిస్థితి. ఇప్పటికీ కురిసిన భారీ వర్షాల దెబ్బ నుంచి ఇంక బయటపడ లేదు. ఇంతలోనే మరో పిడుగు లాంటి వార్త. ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మరొసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతారవరణ శాఖ తెలిపింది. రానున్న రెండు రోజుల్లో అండమాన్ సమీపంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో నేటి నుంచి ఈ నెల30 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారతీతయ వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రధానంగా చిత్తూరు, నెల్లూరు జిల్లా భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన జిల్లాలో ఓ మోస్తారు గా వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతాల్లో 13 సెం.మీ కంటే ఎక్కువ వర్షం కురిసే సూచనలున్నాయని అంచన వేస్తున్నారు.
వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభావిత జిల్లాల అధికారులు అప్రమత్తమైయారు. తీరప్రాంతాల్లో ఎక్కువ వర్షంపడే అవకాశం ఉందని చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ చెప్పారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాట్ వేలు దాటి వెళ్లోద్దని ప్రజలకు సూచించారు. చిత్తూరు జిల్లాలో నేడు విద్యాలయాలకు సెలవు ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక అధికారులు తెలిపారు.