4 Days Rain: దేశవ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే అత్యధికంగా 42 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జనం ఎండల కారణంగా బయట తిరగాలంటేనే భయపడిపోతున్నారు. ముఖ్యమైన పనులైతే తప్ప బయటకు అడగుపెట్టడం లేదు. గత రెండు రోజుల నుంచి మూగ ఎండ ముసురుకుంది. సూర్యుడు బయటకు రాకపోయినా.. వేడి, ఉక్కపోత బాగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు ఊరట కలిగించే వార్త చెప్పింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నాలుగు రోజుల పాటు తేలికపాటినుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది.
ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడిందని వెల్లడించింది. దీని ప్రభావంతో పలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల గంటకు 30 కి.మీ నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని ఐఎండీ పేర్కొంది. ఏప్రిల్ 17నుంచి 20వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నెల 21వ తేదీనుంచి వాతవరణంలో పెద్దగా మార్పులు ఉండబోవని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి : ఇంట్లో నుంచి వెళ్లగొట్టిన అత్తమామలు.. భర్త కోసం భార్య పోరాటం!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.