రాజకీయాలు, వ్యక్తిగత జీవితం రెండింటికి మధ్య వ్యత్యాసం ఉండాలి. రాజకీయాల్లో.. సొంత పార్టీ తరఫున విమర్శలు, ఆరోపణలు ఎన్ని చేసుకున్నా సరే అవన్ని పార్టీ వరకే ఉండాలి. పార్టీల పరంగా ఉన్న విభేదాలను దృష్టిలో పెట్టుకుని.. వ్యక్తిగతంగా కూడా అలానే ప్రవర్తించకూడదు. ముఖ్యంగా విషాద సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు మానవత్వాన్ని ప్రదర్శించాలి. అలాంటి వారినే ప్రజలు మంచి మనిషిగా, నేతగా గుర్తిస్తారు. ప్రతి ఒక్కరు వారిని అభిమానిస్తారు. తాజాగా పవర్ స్టార్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై ఇలానే ప్రశంసలు కురిపిస్తున్నారు వైసీపీ కార్యకర్తలు. ఎందుకో తెలియాలంటే ఇది చదవండి..
ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల రాజకీయ నేతలు సంతాంప వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా గౌతమ్ రెడ్డి మృతిపై సంతాపం తెలపడమే కాక కీలక నిర్ణయం తీసుకుని అందరిని ఆశ్చర్యపరిచారు. పవన్ అప్ కమింగ్ సినిమా భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిబ్రవరి 21న హైదరాబాద్ లో భారీ ఎత్తున నిర్వహించేందుకు చిత్ర బృందం సిద్ధమయ్యింది. ఈ మేరకు ఏర్పాట్లు కూడా సాగుతున్నాయి.
ఇది కూడా చదవండి : మేకపాటి గౌతమ్ రెడ్డి అంటే సీఎం జగన్ కి ఎందుకు అంత ఇష్టం?అయితే అనుకోకుండా ఏపీ మినిస్టర్ మేకపాటి గౌతమ్ రెడ్డి సోమవారం కన్ను మూయడంతో.. భీమ్లా నాయక్ ప్రీరిలీజ్ ఈవేంట్ను వాయిదా వేస్తున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఇలాంటి సంతాప సమయంలో సినిమా వేడుక నిర్వహించడానికి మనస్కరించట్లేదని.. అందుకే వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ఈ కార్యక్రమం జరుగుతుందని తెలుపుతూ.. ట్విట్టర్ వేదికగా ప్రకటన విడుదల చేశారు పవన్ కల్యాణ్.
విషాద సమయంలో సినిమా వేడుక చేయడానికి మనస్కరించట్లేదు jsp chief @PawanKalyan pic.twitter.com/o5wEeFht9F
— L.VENUGOPAL (@venupro) February 21, 2022
ఈ నిర్ణయంపై ఇటు పవన్ క్యలాణ్ అభిమానులతో పాటు వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పవన్ తన స్వార్థం చూసుకోకుండా.. సంయమనం పాటించి.. ఇలాంటి హుందాకరమైన నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. రాజకీయాలకు కాకుండా.. వ్యక్తిగత బంధాలకు విలువ ఇచ్చినందుకు పవన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. పవన్ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి : మేకపాటి గౌతమ్ రెడ్డి గురించి మీకు తెలియని విశేషాలు!