టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 98వ రోజుకి చేరుకుంది. 98వ రోజు పాదయాత్ర శ్రీశైలం నియోజకవర్గంలోని విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు.
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 98వ రోజుకి చేరుకుంది. 98వ రోజు పాదయాత్ర శ్రీశైలం నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఈ పాదయాత్రలో లోకేశ్ ప్రతి రోజు సుమారుగా 1000 మందికి సెల్ఫీలు ఇస్తున్న సంగతి తెలిసిందే. శనివారం కూడా విడిది కేంద్రంలో 1000 మందికి లోకేశ్ సెల్ఫీ ఇచ్చారు. విడిది కేంద్రం వద్ద తనని కలవడానికి వచ్చిన ప్రజలు, అభిమానులు, కార్యకర్తల్ని లోకేశ్ కలిశారు. అలానే తన కోసం వచ్చిన అభిమానులతో, ప్రజలతో లోకేశ్ ఓపికగా సెల్ఫీ దిగడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి భారీ స్పందన వస్తోంది. లోకేశ్ చేస్తున్న యువగళం పాదయాత్రలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అలానే యువనేతకు అభిమానులు, కార్యకర్తలు, జనం తమ మద్దతు తెలియజేస్తున్నారు. దారి పొడవునా పూలు చల్లుతూ లోకేశ్ కి నియోజకవర్గ ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారు. కర్నూలు జిల్లాలో ముగిసిన లోకేశ్ పాదయాత్ర.. ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని శ్రీశైలం నియోజకవర్గంలో కొనసాగతుంది. 98వ రోజు యువగళం పాదయాత్ర శ్రీశైలం నియోజవర్గంలో ప్రారంభమైంది. కె. స్టార్ గోడౌన్ క్యాంప్ సైట్ నుంచి లోకేశ్ పాదయాత్ర ప్రారంభమైంది. కరివెన గ్రామంలో స్థానికులతో లోకేశ్ సమావేశమయ్యి.. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
సాయంత్రం ఆత్మకూరు పట్టణంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో లోకేశ్ ప్రసంగించారు. అధికార వైసీపీపై లోకేశ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అలానే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఆ తరువాత ఆత్మకూరు రోడ్డులో న్యాయవాదులతో సమావేశమయ్యారు. అలానే నంద్యాల మూల మలుపు వద్ద ముస్లిం నేతలతో లోకేశ్ కలిశారు. నల్లకాల్వలో స్థానికులతో మాటామంతీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలా ప్రజలతో మమేకమవుతూ లోకేశ్ తన పాదయాత్రను 98వ రోజు కొనసాగించారు. మరి.. 98వ రోజు శ్రీశైలం నియోకవర్గంలో జరిగిన లోకేశ్ పాదయాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.