సాయి ధరమ్ తేజ్- దేవా కట్టా రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అటు రాజకీయంగా, ఇటు సినీ పరిశ్రమలోనూ సంచలనంగా మారింది. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నానిని పవన్ కళ్యాన్ సన్నాసి అంటూ సంబోదించిన విషయం తెలిసిందే. దీనిపై వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు.. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి పేర్ని నాని సైతం తీవ్ర పదజాలంతో చెలరేగారు. మంత్రిని పవన్ కళ్యాణ్ ఆ సన్నాసి అంటూ వ్యాఖ్యానించటంతో.. మంత్రి సైతం ధీటుగా సమాధానం ఇచ్చారు.
మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ లో మాట్లాడుతుండగా.. ఓ రిపోర్టర్ మిమ్మల్ని పవన్ కల్యాణ్ సన్నాసి అన్నాడు కదా అని ప్రశ్నించారు. దానికి పేర్ని నాని బదులిస్తూ… పవన్ నాయుడు నన్ను సన్నాసి అన్నాడా? అయినా మేం చుట్టాలం, ఒకే కులపోళ్లం, సన్నాసి, దద్దమ్మ అనుకుంటాం, అరే ఓరే అనుకుంటాం.. అందులో తప్పేమీ లేదు అన్నారు. నేను తప్పు కూడా పట్టడం లేదు. నేను కాపునే… మేమంతా ఒక కులపోళ్లం కాబట్టి నేను సన్నాసిని అయితే పవన్ కల్యాణ్ గాడు కూడా సన్నాసిన్నర అన్నారు. మావాడు తెగ మాట్లాడుతున్నాడు.. చుట్టాలం కాబట్టి ఇక దాయడం ఎందుకు అంటూ పవన్ ను ఏకవచన సంబోధిస్తూ.. చురకలు అంటించారు. మేం అంతా ఒకటే, అంతా ఆ తానులో ముక్కలం. ఇవాళ సాయితేజ్ యాక్సిడెంట్ గురించి కూడా మా వెధవన్నర వెధవ మాట్లాడాడు. మీడియాదే తప్పు అని మాట్లాడాడు. మీడియాకు బుద్ధి ఉందా అని అడిగాడు.
తెలంగాణ పోలీసులు ప్రమాదంపై ఏదైతే చెప్పారో.. అదే మీడియా చెప్పిందని మంత్రి గుర్తుచేశారు. పవన్కు దమ్ముంటే తెలంగాణ పోలీసులను, కేసీఆర్ను తిట్టాలని నాని సవాల్ విసిరారు. కేసీఆర్ ను సన్నాసి, వెధవ, లుచ్ఛా అని తిట్టలేవా? కేసీఆర్ ను తిట్టాలంటే గజగజ వణికిపోతాడని, ప్యాంట్లో కారిపోతాయని అందరికీ తెలుసు. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ వైఎస్సార్ కాంగ్రెస్ అంటున్నావు… కానీ ఇది రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. కాబట్టే నువ్వు ఏది పిచ్చవాగుడు వాగినా చెలామణీ అవుతోందని అన్నారు. ఇక సీఎ జగన్ కోడికత్తి కేసు ఏమైందో రాసుకోండ్రా అంటూ మీడియాకు చెబుతున్నారు. అరే బాబూ… కోడికత్తి కేసు ఎన్ఐఏ చూస్తోంది. నీకు ఒంట్లో ఏమైనా ఉంటే వెళ్లి అమిత్ షాను అడుగు. కోడికత్తి కేసు ఏమైందో ఆయన చెబుతారు. మా పీకే పిరికి సన్నాసిలే అని చెబుతానని.. కోడి కత్తి కేసు ఎన్ఐఏ చూస్తొందని దమ్ముంటే అమిత్ షాను కేసు వివరాలు అడగాలని డిమాండ్ చేశారు.