ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ తన మంత్రి వర్గంలో కొత్తవారికి ఛాన్సు ఇచ్చారు. పదవీ ప్రమాణ స్వీకారం తర్వాత పలువురు మంత్రులు పుణ్య క్షేత్రాలకు వెళ్తున్నారు. మరికొంత మంది తమ సొంత నియోజకవర్గాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. అయితే ఓ కార్యకర్త అతి చేయడంతో సహనం కోల్పోయిన రెవెన్యూశాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆ కార్యకర్త చెంప చెల్లుమనిపించారు. వివరాల్లోకి వెళితే..
ఇటీవలే ఏపీ రెవెన్యూ శాఖ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. కొత్తగా మంత్రి పదవి చేపట్టిన తర్వాత శనివారం తొలిసారి తన సొంత జిల్లా శ్రీకాకుళంకు ఆయన వచ్చారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవలే ఏపీ రెవెన్యూ శాఖ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. కొత్తగా మంత్రి పదవి చేపట్టిన తర్వాత శనివారం తొలిసారి తన సొంత జిల్లా శ్రీకాకుళంకు ఆయన వచ్చారు.
ఈ క్రమంలో ఆయనతో కరచాలనం చేసేందుకు కార్యకర్తలు ఎగబడగా… ఓ కార్యకర్త కాస్త అత్యుత్సాహం చూపించి మంత్రి చేయి గట్టిగా లాగడంతో విసిగెత్తిపోయిన ధర్మాన అతడి చెంప ఛెల్లుమనిపించారట. నియోజకవర్గంలో ధర్మాన ప్రసాదరావుకు ఎంతో సౌమ్యుడిగా మంచి పేరుంది. అలాంటి ఆయనే సహనం కోల్పోయి ఓ కార్యకర్తపై చేయి చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
YSRCP అధర్మ బాదుడు pic.twitter.com/soZ3oE0xF4
— Telugu Desam Party (@JaiTDP) April 16, 2022