మీరు మాంసం ప్రియులా? ముక్కలేనిదే ముద్ద దిగడం లేదా? అయితే ఈ వార్త తప్పక చదవాల్సిందే. కొందరు మాంసం అమ్మకం దారులు వినియోగదారులను నట్టేట ముంచుతూ మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలో మున్సిపల్ అధికారులు జరిపిన దాడుల్లో ఒళ్లు గగుర్పొడిచే నిజాలు బయటపడ్డాయి.
ఇక విషయం ఏంటంటే..? జిల్లాలోని సాలూరు ప్రాంతంలో ఉన్న మాంసం దుకాణాల్లో అవకతవకలు జరుగుతున్నాయన్న సమాచారంతో మున్సిపల్ అధికారులు హుటాహుటిన దుకాణాలపై దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా అధికారులకు సుమారు 46 కేజీల కుళ్ళిన మాంసం బయటపడడంతో మున్సిపల్ అధికారులు షాక్ కు గురయ్యారు.కుళ్లిన మాంసాన్ని స్వాధీనం చేసుకుని మోసాలకు పాల్పడుతున్న రెండు దుకాణాలపై కేసులు నమోదు చేశారు. దీంతో పాటు ఇరవై వేల జరిమానా కూడా విధించారు. ఈ సందర్భంగా మాంసం విక్రయాల్లో మోసాలకు పాల్పడితే అమ్మకందారులపై ఇక నుంచి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అధికారుల తనిఖీల్లో బయటపడ్డ ఈ ఒళ్లు గగుర్పొడిచే నిజాలను చూసిన స్థానికులు మాంసం తినాలంటనే జంకుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.