ఏపీలో మందుబాబులకు జగన్ ప్రభుత్వం శనివారం శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్లో మద్యం ధరలు తగ్గడంతో మందుబాబుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇన్నాళ్లు అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేసిన మద్యం ఇప్పుడు కొంత చవగ్గా లభిస్తుండడంతో పట్టపగ్గాల్లేని సంతోషంతో ఉన్నారు. వ్యాట్, అదనపు ఎక్సైజ్ డ్యూటీ ప్రత్యేక మార్జిన్లో హేతుబద్ధతను తీసుకొచ్చింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గత కొంత కాలంగా అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేసిన మద్యం ఇప్పుడు కొంత చవగ్గా లభిస్తుండడంతో పట్టపగ్గాల్లేని సంతోషంతో ఉన్నారు. ఇంకొందరైతే మద్యం ధరలు తగ్గడాన్ని పండుగలా జరుపుకున్నారు.
ఈ నేపథ్యంలోనే కొందరు మందు బాబులు మద్యం దుకాణం వద్ద పూజలు చేశారు. వైన్ షాపులు హారతులు ఇచ్చారు. కొబ్బరికాయలు కొట్టిన తర్వాతే మద్యాన్ని కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక మద్యం ధరలను సర్కార్ 15 నుండి 20 శాతం తగ్గించింది. దాంతో క్వార్టర్ పై రూ.15 నుండి రూ.20 వరకు తగ్గాయి. అంతే కాకుండా ఫుల్ బాటిల్ ల పై రూ.120 వరకు తగ్గాయి. అన్ని రకాల బీర్ల పై రూ.20 నుండి రూ.30 తగ్గాయి.
ఇదీ చదవండి : ఒమిక్రాన్ కు మందు రెడీ అంటున్న ఆనందయ్య! త్వరలో పంపిణీ!
ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్లోకి వస్తున్న అక్రమ మద్యం, రాష్ట్రంలో నాటు సారా తయారీని అరికట్టేందుకే ధరల తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.