కేఏ పాల్.. ఈ పేరు వినగానే.. ఆయన నోటి నుంచి వెలువడే కామెడీ డైలాగ్లు, పిచ్చి చేష్టలు ఇవే గుర్తుకు వస్తాయి. కేఏ పాల్ అనగానే కామెడీ పీస్ అనే ఫీలింగ్ మనసులోకి వచ్చేస్తుంది. దానికి తగ్గట్టే మీడియా ఆయనను ఎగతాళి చేస్తూ.. ఆయన మీద కామెడీ వీడియోలు చేస్తూ.. కించపరుస్తుంది. కానీ కొన్ని ఏళ్ల క్రితం కేఏ పాల్ అంటే ఓ ప్రభంజనం.. సంచలనం. ఆయన కోసం, ఆయన ఇచ్చే ఇంటర్వ్యూల కోసం ప్రపంచ మీడియా పడిగాపులు కాసేది. విదేశాల నుంచి కోట్లాది రూపాయల నిధులు వచ్చేవి. అలా వచ్చిన సొమ్ముతో మెదక్ జిల్లాలో 1200 ఎకరాల్లో చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశాడు. గ్లోబల్ పీస్ పేరుతో సంస్థను స్థాపించి.. వృద్ధులు, వికలాంగులు, వితంతువులుకు ఆర్థిక సాయం అందించాడు. అమెరికా అధ్యక్షుడి కన్నా ముందే.. బోయిగ్ 747 ఎస్పీ విమానం కలిగిన ఉన్న తొలి వ్యక్తిగా కేఏ పాల్ రికార్డు సృష్టించాడు. మరి అలాంటి వ్యక్తి ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది.. ఆయన కొన్న విమానాలు ఎక్కడ ఉన్నాయి వంటి పలు ఆసక్తికర అంశాలపై కేఏ పాల్ తాజాగా ఓ చానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేఏ పాల్ స్పందించాడు.
ఇక ఇంటర్వ్యూ సందర్భంగా కేఏ పాల్ తన ఛారిటీ సంస్థల ద్వారా.. ప్రపంచ దేశాల నుంచి తీసుకువచ్చిన నిధుల గురించి వివరించే క్రమంలో కేఏ పాల్కి, ప్రముఖ మీడియా అధినేత మధ్య చిన్నపాటి వివాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా కేఏ పాల్.. ఆ హోస్ట్ తీరుకి ఆశ్చర్యపోతూ.. మీకు ఏమయ్యింది అంటూ ప్రశ్నించారు. అందుకు ఆ మీడియా అధినేత నాకు మైండ్ దొబ్బింది అంటూ కామెంట్ చేశారు. ఆ తర్వాత కేఏ పాల్.. తాను ఎంతమందిని ఎన్ని విధాలుగా ఆదుకున్నాడో వివరించాడు. ఇలా ఈ ఇంటర్వ్యూ మొత్తం పాల్.. ఆ మీడియా అధినేతకు చుక్కలు చూపించడం విశేషం. ఇక.. కేఏ పాల్ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.