జీవితంలో చోటుచేసుకున్న కష్టాలు, అవమానాలే విజయానికి సోపానాలు. ఇటువంటి అనుభవ పాఠాలు ఉన్నత లక్ష్యాలను సాధించడానికి దోహదపడతాయి. సాధించాలనే కృషి, పట్టుదల ఉంటే ఎంతటి లక్ష్యాన్నైనా సాధించవచ్చు. ఇదే రీతిలో ఓ యువకుడు తన చిన్న తనంలోనే తండ్రి చనిపోయినప్పటికి తల్లి కష్టం తో చదువుకుని దేశంలోనే అత్యున్నత సర్వీస్ అయిన ఐఎఎస్ సాధించి ఆ తల్లి కష్టానికి ప్రతిఫలం అందించారు.
జీవితంలో చోటుచేసుకున్న కష్టాలు, అవమానాలే విజయానికి సోపానాలు. ఇటువంటి అనుభవ పాఠాలు ఉన్నత లక్ష్యాలను సాధించడానికి దోహదపడతాయి. సాధించాలనే కృషి, పట్టుదల ఉంటే ఎంతటి లక్ష్యాన్నైనా సాధించవచ్చు. ఇదే రీతిలో ఓ యువకుడు తన చిన్న తనంలోనే తండ్రి చనిపోయినప్పటికి తల్లి కష్టం తో చదువుకుని దేశంలోనే అత్యున్నత సర్వీస్ అయిన ఐఎఎస్ సాధించి ఆ తల్లి కష్టానికి ప్రతిఫలం అందించారు.
పార్వతీపురానికి చెందిన బాబురావు, స్వర్ణలత దంపతులకు ఇద్దరు సంతానం. బాబురావు ఇండియన్ ఆర్మీలో పనిచేసి రిటైర్డయ్యారు. స్వర్ణలత ఎఎన్ ఎంగా పనిచేస్తుంది. వీరి పెద్దకుమారుడు ప్రదీప్ ఓ మల్టీనేషనల్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. చిన్న కొడుకు సూరపాటి ప్రశాంత్ కుమార్ అసిస్టెంట్ కలెక్టర్ గా వృత్తి శిక్షణలో ఉన్నారు. అయితే ప్రశాంత్ కుమార్ ప్రయాణం అంతా సవాళ్లతో కూడుకుని ఉన్నది. ఆయన ఆరోతరగతి చదివే సమయంలో తండ్రి బాబురావు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆ తరువాత తల్లి స్వర్ణలత తనకు వచ్చే వేతనంతోనే పిల్లలిద్దరిని చదివించింది. ఏ లోటు రాకుండా వారిని చూసుకుంది. తల్లి కష్టం వృధా కాకుండా కష్టపడి చదివిన ప్రశాంత్ కుమార్ సివిల్స్ రాసి ఐఎఎస్ కు ఎంపికయ్యారు. తల్లి కళ్లల్లో ఆనందం నింపాడు.
అయితే తనకు ఓ ఐఎఎస్ ప్రేరణ అని చెప్పుకొచ్చారు ప్రశాంత్ కుమార్. పార్వతీపురం మన్యం జిల్లాలోని మన్యం ఐటిడిఎ పిఒగా ఐఎఎస్ లక్షీషా పనిచేస్తున్న సమయంలో అక్కడి ప్రజలకు వైద్య సదుపాయాలు కల్పించి, పేదల జీవితాల్లో వెలుగులు నింపారని తన తల్లి చెప్పిందని తెలిపారు. ఐఎఎస్ సర్వీసుతో సామాన్య ప్రజలను ఆదుకోవడంతో పాటు సమాజంలో మార్పు తీసుకు రావచ్చని చెప్పిందని తెలిపారు. దీంతో తనకు ఐఎఎస్ కావాలని దేశ సేవ చేయాలని అనిపించిందని ప్రశాంత్ కుమార్ తెలిపారు. ప్రశాంత్ కుమార్ ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో శ్రీకాకుళంకు చెందిన గోపాల కృష్ణ దేశ స్థాయిలో సివిల్స్ లో 3వ ర్యాంకు సాధించారు. దీంతో సాధించాలనే సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని, ఎవరైనా సాధించవచ్చని తెలుసుకున్నానని ప్రశాంత్ కుమార్ తెలిపారు. లక్ష్యసాధనలో నిరాశ నిస్పృహలకు లోనుకాకూడదని, పరిస్థితులు ఎలా ఉన్నా వాటిని అధిగమించి యువత వారి కలలను నెరవేర్చుకోవాలని అసిస్టెంట్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ తెలిపారు.