రానున్న రెండు మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలియజేస్తోంది. దక్షిణ, వాయువ్య బంగాళఖాతంలో అల్ప పీడనం ఏర్పడింది. దీంతో ఉపరితల అవర్తనం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ కేంద్రం. కాగా కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
ఇక తెలంగాణలోనూ అక్కడక్కడ మెస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రైతులు, చేపల వేటకు వెళ్లే కాస్త జాగ్రత్తగా ఉండాలని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు. ఇక ఇప్పటికే కురిసిన వర్షాలతో తెలంగాణలో అక్కడక్కడ వాగులు, వంకలు నిండిపోయాయి. దీంతో పాటు శ్రీశైలం, నాగార్జున సాగర్ వంటి జలాశయాలు నీటి కుండలా మారాయి. దీంతో మారోసారి వర్షాలు కురువనున్న నేపథ్యంలో రైతులు అలెర్ట్ అవుతున్నారు.