ఎంతో సంతోషంగా సాగుతున్న వీరి జీవితంలో అనుకోని విషాదం తొంగి చూసింది. వీరిద్దరరూ హాస్పిటల్ కి వెళ్లి చూపించుకోగా.. ఒకరి గుండె సమస్య.. ఇంకొకరికి షుగర్ బయటపడ్డాయి.
ప్రతీ రోజు మాట్లాడుకోకున్నా అవసరమైనప్పుడు మనకు ధైర్యం, ఓదార్పు ఇచ్చే వాడే స్నేహితుడు. మనకు ఓ మంచి ఫ్రెండ్ ఉన్నాడన్న నమ్మకమే.. మనకు కొండంత ధైర్యాన్ని, మనసుకు ఉపశమనాన్ని ఇస్తుంది. అందుకే నిజమైన స్నేహితుడు కంటికి దూరమైనా మనసుకు దగ్గరగా ఉంటాడు అంటారు. అలాంటిది ఒక్కోసారి కుటుంబసభ్యులతో కూడా చెప్పుకోలేని సమస్యలను ఆత్మీయ స్నేహితులతో చెప్పుకోవడం వలన మనకు అది ఎంతో మనస్సాంతిగా అనిపిస్తుంది. అలాంటి ఓ స్నేహ బంధంలో.. ఇద్దరు యువకులు మృత్యువులోను తమ స్నేహాన్ని వీడలేదు. పూర్తి వివరాల్లోకి వెళితే..
గుంతకల్లు మండలం కసాపురం గ్రామానికి చెందిన ఉరుకుందప్ప, లక్ష్మీదేవి దంపతుల కుమారుడే వీరన్న.. అదే గ్రామానికి చెందిన రాము, మహాలక్ష్మీ దంపతుల కుమారుడు రవీంద్రలు మంచి స్నేహితులు. ప్రతి పనిని కలిసి చేసేవారు. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లేవారు. ఇద్దరూ గత కొన్నాళ్లనుంచి డ్రైవర్లుగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరన్నకు తొమ్మిదేళ్ల క్రితమే పెళ్లయింది. కృపాకుమారి అనే యువతిని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు 6,4 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు బిడ్డలున్నారు. ఇక, ఆరు నెలల క్రితమే లక్ష్మీ అనే యువతితో రవీంద్ర కు వివాహం అయ్యింది.
ఎంతో సంతోషంగా సాగుతున్న వీరి జీవితంలో అనుకోని విషాదం తొంగి చూసింది. వీరన్న, రవీంద్ర అనారోగ్యం బారిన పడ్డారు. వీరిద్దరరూ హాస్పిటల్ కి వెళ్లి చూపించుకోగా.. వీరన్న గుండెసంబందించిన వ్యాధితో భాదపడుతున్నట్లు.. రవీంద్ర షుగర్, బీపీ తో భాదపడుతున్నట్లు వైద్యులు తెలిపింది. ఈ క్రమంలోనే ఇద్దరూ మద్యానికి తీవ్రంగా బానిసయ్యారు. అక్కడితో వారి ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది. పది రోజుల క్రితం ఆయాసం ఎక్కువకావడంతో వీరన్నను కర్నూల్ ప్రభుత్వా ఆసుపత్రిలో చేర్పించారు.
అలాగే రవీంద్ర ఆరోగ్యం కూడా క్షీణించడవతో అతడి కుటుంబసభ్యులు అనంతపురంలోని సర్వజనాఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ క్రమంలోనే వైద్యులు రవీంద్రను మెరుగైన చికిత్స కోసం కర్నూల్లోని ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పారు. దీంతో రవీంద్రను కర్నూలుకు తీసుకువచ్చారు. అయినా.. కూడా ఫలితం లేకుండా పోయింది. రవీంద్ర, వీరన్నల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు రవీంద్ర, 5:30 గంటలకు వీరన్న మృతి చెందారు. ప్రాణ స్నేహితుల మరణ వార్త తెలుసుకున్న గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు.