ఆనందనగా స్నాక్స్ ఆరగించడమే ఆ విద్యార్థినుల పాలిట శాపమైంది. తిన్న కాసేపటికే వాంతులు, విరేచనాలతో కొందరు.. కడుపు నొప్పితో మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ విషాద ఘటన పాణ్యం మండలం నెరవాడ గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది.
కలుషిత ఆహారం తిని 50 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ విషాద ఘటన పాణ్యం మండలం నెరవాడ గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం స్నాక్స్ గా బొరుగులు మిక్సర్ తిన్న విద్యార్థినులు.. ఆపై కొద్దిసేపటికే వాంతులు, విరేచనాలతో పరుగులు పెట్టారు. మరొకొందరు తీవ్ర కడుపునొప్పితో కేకలు పెట్టారు. వెంటనే పాఠశాల సిబ్బంది అప్రమత్తమై వీరిని ఎమర్జెన్సీగా నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఎప్పటిలానే గురువారం సాయంత్రం స్నాక్స్ గా బొరుగులు మిక్సర్ ను విద్యార్థినులకు అందించారు. వాటిని తిన్న కాసేపటికే విద్యార్థినులకు వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. మరికొందరు తీవ్ర కడుపునొప్పితో బాధపడ్డారు. ఒకరి వెంట మరొకరు అనారోగ్యానికి గురికావడంతో పాఠశాల సిబ్బందికి ఏం జరిగిందో అర్థం కాలేదు. వెంటనే 108 సిబ్బందికి సమాచారమిచ్చి నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థినుల తల్లిదండ్రులు ఇప్పటికే ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ మంజీర్ జిలాని డాక్టర్లను సంప్రదించినట్లు సమాచారం. అస్వస్థతకు గురైన విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.
నంద్యాల – నెరవాడ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్, 50 మంది విద్యార్థినులకు అస్వస్థత.#Nandyala pic.twitter.com/4R3B0T1IAL
— Telugu Scribe (@TeluguScribe) March 17, 2023