అనంతపురం జిల్లా శింగనమల మండలం నాగుల గుడ్డం గ్రామానికి చెందిన సాకె భారతి చదువుపై ఉన్న మక్కువతో ఎన్ని ఆటంకాలు ఎదురైన ఎదుర్కొని రసాయన శాస్త్రంలో పిహెచ్ డి పట్టా పొందింది. తన కలను నెరవేర్చుకుంది.
కష్టాల కడళి దాటుకుని, పేదరికాన్ని జయించి రసాయన శాస్త్రంలో పిహెచ్ డి పట్టా పొందిన సాకె భారతి నేడు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్లుగా.. కష్ట పడితేనే ఫలితం, చదువుకుంటేనే పేదరికం పోతుందని భావించి పూటగడవని స్థితిలో కూలీ పనులు చేస్తూ పిహెచ్ డి పొందటం సాధారణ విషయం కాదు. భారతి చేసిన ఈ పనికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మారుమూల గ్రామం నుంచి వచ్చి ఉన్నత విద్యకోసం భారతి చేసిన కృషి ఎందరికో ఆదర్శం. ముగ్గురు ఆడపిల్లల్లో మొదటి కూతురైన భారతి చిన్న తనం నుంచే కష్టాలను అనుభవించింది. చిన్న తనంలోనే మేనమామతో పెళ్లైన భారతి అతడి సాయంతో చదువును కొనసాగించింది. ఇదిలా ఉంటే తాజాగా ఎంఎల్ సీ కుంబా రవి బాబు సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్య్వూలో డాక్టర్ భారతికి తిరుపతి యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా అవకాశం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ఎంఎల్సీ కుంబ రవి బాబు మాట్లాడుతూ.. తిరుపతి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తో మాట్లాడానని రసాయన విభాగంలో టీచింగ్ అసిస్టెంట్ ఫ్యాకల్టీగా నియమించుకునేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరినట్లు వెల్లడించారు. వైస్ ఛాన్సలర్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. డైరెక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా తీసుకునే పరిస్థితులు ఉండవని దానికి నోటిఫికేషన్ ద్వారానే ఆ పోస్టులను భర్తీ చేస్తారని తెలిపారు. త్వరలోనే డాక్టర్ భారతి కెమిస్ట్రీ విభాగంలో టీచింగ్ ఫ్యాకల్టీగా చేరుబోతోందని వెల్లడించారు. డాక్టర్ భారతికి ముందుగా ఆర్థికంగా నిలదొక్కుకునే స్థోమతను కల్పించాలని దీనిలో భాగంగానే టీచింగ్ ఫ్యాకల్టీగా నియమించే ఏర్పాట్లు చేస్తున్నామని కుంబ రవి బాబు తెలిపారు.