CM YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్.. ఏపీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం అందుబాటులో ఉంది. అయితే, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టడంపై ప్రతి పక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. మొన్నీమధ్య ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆంగ్ల విద్యపై స్పందించారు. ఆంగ్ల విద్య నేర్చుకున్న వారు మొద్దబ్బాయిల్లా తయారవుతారంటూ ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్న విద్యార్థులతో ముచ్చటించారు. గురువారం బెండపూడి హైస్కూల్ విద్యార్థులతో ముచ్చటించిన ఆయన వారి ఇంగ్లీష్ వాక్ ఛాతూర్యానికి ఫిదా అయిపోయారు.
సీఎం జగన్తో రేష్మా అనే పదో తరగతి విద్యార్థిని పూర్తి ఇంగ్లీష్లో.. అనర్గళంగా మాట్లాడింది ‘‘ నేను దీన్ని నమ్మలేకుండా ఉన్నా.. నేను మిమ్మల్ని మొదటిసారి చూస్తున్నా.. నాకెంతో ఎగ్జైట్గా ఉంది. ఇచ్చిన హమీలన్నీ నెరవేరుస్తున్న సీఎంలలో.. నేను చూసిన వారు మీరే.. ఇంగ్లీష్ నేర్చుకుంటే అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడొచ్చు….’’ అంటూ తన ఇంగ్లీష్ ప్రతిభతో ముఖ్యమంత్రిని ఆకట్టుకుంది. రేష్మతో పాటు మరికొంతమంది విద్యార్థులు ముఖ్యమంత్రితో ఇంగ్లీష్లో ముచ్చటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఇంగ్లీష్ ప్రతిభకు సామాన్య జనం సైతం వావ్!! అంటున్నారు. విద్యార్థులు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ఆశ్చర్యంతో నొరెళ్లబెట్టి చూస్తున్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Vidadala Rajini: మానవత్వం చాటుకున్న వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని