ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (88) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శనివారం ఉదయం బీపీ డౌన్ కావడంతో కుటుంబీకులు బంజారాహిల్స్లోని స్టార్ ఆస్పత్రికి తరలించే లోపే మార్గం మధ్యంలోనే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. రోశయ్య మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు.
కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బ్యాలెన్స్ చేస్తూ బడ్జెట్ రూపొందించడంలో రోశయ్య ఘనాపాటి. ఆర్థిక అపర చాణక్యుడిగా రోశయ్య తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. ఆ నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఎక్కువ సార్లు ఆర్థిక మంత్రిగా రోశయ్య పనిచేశారు. శాసనసభలో వరుసగా ఏడు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తిగా రోశయ్య రికార్డు సాధించారు.
అసెంబ్లీలో ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానం చెప్పడంలో రోశయ్య స్టైలేవేరు. రాజకీయ కురువృద్ధుడైన కొణిజేటి రోశయ్య అకాల మరణం పట్ల ఆయన అభిమానులు దిగ్భ్రాంతి గురయ్యారు. రోశయ్య మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖలు సంతాపం తెలిపారు. మాజీ సీఎం రోశయ్య మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. అంత గొప్ప నాయకుడు లేని లోటు తీర్చలేనిదని అన్నారు. రోశయ్య కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు