సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. స్వరాజ్, ఏక్ కహానీ, షో టైమ్ లాంటి టీవీ షోలకు ప్రసిద్ధి చెందిన ప్రముఖ నటి – నిర్మాత మంజు సింగ్ గుండెపోటుతో మరణించారు. ఆమె వయస్సు 73 సంవత్సరాలు. చిత్ర పరిశ్రమలోని సహనటులు ‘దీదీ’ అని పిలుచుకునే మంజు సింగ్.. అధికార్, సమ్యక్త్వా: ట్రూ ఇన్ సైట్ లాంటి సామాజిక మరియు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రశంసలు అందుకున్నారు.
1979లో ప్రముఖ నిర్మాత హృషికేశ్ ముఖర్జీ నిర్మించిన క్లాసిక్ చిత్రం ‘గోల్ మాల్’ ద్వారా ఇండస్ట్రీలో నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా మంజు సింగ్ పెద్ద కుమార్తె సుపర్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మంజు సింగ్ గురువారం ఉదయం ఆమె నివాసంలో తుదిశ్వాస విడిచారు. న్యూయార్క్ నుండి ఆమె మనవరాలు వచ్చేవరకు కుటుంబసభ్యులు ఎదురుచూస్తున్నందున శనివారం ఆమె అంత్యక్రియలు జరిగాయి. మంజు సింగ్ మృతికి బాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
मंजू सिंह जी नहीं रही ! मंजू जी मुझे दिल्ली से मुंबई लायी थी दूरदर्शन के लिए उनका शो स्वराज लिखने ! उन्होंने DD के लिए कई नायब शोज़ एक कहानी, शो टाइम आदि बनाए थे . हृषिकेश मुखर्जी की फ़िल्म गोलमाल की रत्ना हमारी प्यारी मंजू जी आपका प्यार कैसे भूल सकता है .. अलविदा ! pic.twitter.com/aKFvMJeFYF
— Swanand Kirkire (@swanandkirkire) April 15, 2022