జ్యోతిష్యుడు ‘వేణు స్వామి’ యూట్యూబ్ వీడియోలు చూసేవారికి ఈ పేరు కొత్తేం కాదు. ఇప్పటికే చాలా మంది సినిమా, రాజకీయ ప్రముఖుల జాతకం చెప్పి విపరీతంగా ట్రోలింగ్ గురయ్యారు వేణుస్వామి. ఆయన చెప్పే దానిలో 90 శాతం నిజమయ్యాయి అని చెప్తుంటారు. ప్రస్తుతం ఆయన ఓ ఇంటర్వ్యూలో ఏపీ రాజకీయాలపై చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. సీఎం జగన్ రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతోంది అని హోస్ట్ అడిగిన ప్రశ్నకు మొత్తం సీఎం జగన్మోహన్రెడ్డి జాతకాన్ని చెప్పుకొచ్చారు వేణుస్వామి. మరి ఆ ఆసక్తికర అంశాలను మీరూ చూసేయండి.
‘సీఎం జగన్కు ప్రస్తుతం అష్టమ శని నడుస్తోంది. ఎవరు ఆయన్ని టార్గెట్ చేయాలన్న వారికి ఉన్న సమయం కేవలం నెలలు మాత్రమే. ఆ తర్వాత ఎవ్వరూ ఆయన్ని టచ్ చేయలేరు. రాజకీయం, న్యాయపరంగానూ ఎవరూ జగన్ టచ్ కూడా చేయలేరు’ అని వేణుస్వామి చెప్పారు. 2022 ఏప్రియల్ ఒకటో తేదీ వరకు మాత్రమే ప్రత్యర్థులకు అవకాశమని తెలిపారు. అప్పటితో సీఎం జగన్ జాతకంలో అష్టమ శని ముగుస్తుందని చెప్పారు. 2022 ఏప్రిల్ 2 తర్వాత దేశంలో రాజకీయంగా చాలా మార్పులు జరగనున్నట్లు వేణుస్వామి వెల్లడించారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో రాజకీయ పరమైన మార్పులు రాబోతున్నాయన్నారు. చాలా మందికి అది నెగెటివ్గా ఉండబోతుంటే.. జగన్కు మాత్రం పాజిటివ్ వైపు వెళ్తున్నట్లు చెప్పారు.
సీఎం జగన్కు రాష్ట్రంలో బాగా వ్యతిరేకత కనిపిస్తోంది.. మళ్లీ గెలుస్తారా అని అడిగిన ప్రశ్నకు వేణుస్వామి చాలా ఆసక్తికర విషయాలు చెప్పారు. 2024 ఎన్నికల్లోనూ సీఎంగా జగనే గెలుస్తారని బల్లగుద్ది చెప్పారు. 2022 ఏప్రియల్ 2 నుంచి సీఎం జగన్ జాతకంలో బుధమహర్దశ ప్రారంభం కానుందన్నారు. ఆ తర్వాత ఎవ్వరూ జగన్ను ఆపలేరన్నారు. జగన్ మొత్తం 17 సంవత్సరాలు సీఎంగా చేస్తారని చెప్పారు. అంటే ఈ టర్మ్ 5 సంవత్సరాలు కాకుండా ఇంకా 12 సంవత్సరాలు అనమాట. రానున్న రెండు టర్మలు సీఎంగా జగనే ఉంటారని కుండ బద్దలు కొట్టారు. మరి, వేణుస్వామి జాతకం ఎంత వరకు నిజమో తెలియాలంటే 2024 వరకు ఆగాల్సిందే.