ఈ ప్రస్తుత పోటీ ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ లేని వ్యక్తులుండరనేది కాదనలేని వాస్తవం. విశ్వంలోని సమాచారమంత ఇట్ట తెలుసుకోవడానికి ప్రతీ ఒక్కరు స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తున్నారు. దీంతో ఏం సమాచారం కావాలన్న గూగుల్ వేదికగా చేసుకుని కావాల్సిన ప్రరిజ్ఞానాన్ని వెతికి పట్టుకుంటున్నారు. దీని మూలంగా విద్యార్థుల నుంచి బడా వ్యాపారుల వరకు ప్రతీ ఒక్కరు గూగుల్ క్రోమ్ని వాడుతున్నారు.
అయితే తాజాగా కొంతమంది సాంకేతిక నిపుణుల మాత్రం కొన్ని కీలక విషయాలు తెలియజేస్తున్నారు.మీ పీసీ లేదా ల్యాప్టాప్లో బ్రౌజర్ ఉపయోగిస్తే గనుక వెంటనే మీ బ్రౌజర్ని అప్ డేట్ చేయాలని సూచిస్తున్నారు. అలా చేయని క్రమంలో మీ ల్యాప్టాప్ హ్యాకింగ్కి గురయ్యే ప్రమాదం పొంచి ఉందని తెలియజేస్తున్నారు. తాజా వెర్షన్ ప్రకారం 92.0.4515.131 కి అప్డేట్ కావాలని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ పేర్కొంది.
దీంతో మన ల్యాప్టాప్లో ఉండే పాత వెర్షన్లో రిమోట్ పద్ధతిలో దాడి జరిగే అవకాశం ఉన్నందున ప్రతీ ఒక్కరు మీ మొబైల్, ల్యాప్టాప్ను త్వరగా అప్డేట్ చేసుకోవాలంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గూగుల్ క్రోమ్ ఉపయోగించే ప్రతీ ఒక్కరు వెంటనే అప్డేట్ చేస్కోండని నిపుణుల తెలియజేస్తుండటం విశేషం.