నగరాల్లో చాలా మంది యువత ఉద్యోగ వేటలో పడి తగిన ఉద్యోగం దొరక్కపోయేసరికి ఫుడ్ డెలివరీ బాయ్స్ గా బైక్ ట్యాక్సీ డ్రైవర్లుగా మారి ఉపాధి పొందుతున్నారు. అయితే ఈ డెలివరీ బాయ్స్ అతి ప్రవర్తనల వల్ల కస్టమర్లు ఇబ్బందులు పడిన సంఘటనలు చాలానే ఉన్నాయి. కస్టమర్లతో దురుసుగా మాట్లాడటం, ఫుడ్ ఆర్డర్ చేస్తే దానిని తీసుకు వచ్చే సమయంలో మధ్యలోనే తినేయడం వంటి సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. అలా అని అందరినీ తప్పు పట్టలేము. ఇక్కడ కూడా ఓ సంస్థకు చెందిన ఫుడ్ డెలివరీ బాయ్ కస్టమర్ కు ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చి ఇంటి ఆవరణలో ఉన్న పూల కుండీలను ప్రమాదవశాత్తు పగలగొట్టాడు. ఆ తరువాత ఆ ఫుడ్ డెలివరీ బాయ్ చేసిన పనికి అందరు ఆశ్యర్యపోయారు.
వాట్సాప్ అంటే తెలియని స్మార్ట్ ఫోన్ యూజర్ ఉండరు. కానీ, వాట్సాప్ వాడాలి అంటే కచ్చితంగా మీ ఫోన్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాల్సిందే. కానీ, ఇప్పుడు వాట్సాప్ తీసుకొచ్చిన సరికొత్త ఫీచర్ సాయంతో మీరు ఇంటర్నెట్ లేకుండానే వాట్సాప్ ని యూజ్ చేయచ్చు.
నగరాలు, పట్టణాల్లో ఇంటర్నెట్ సేవలు బాగానే ఉంటాయి. కానీ, పల్లెటూర్లు, మన్యం, మారుమూల ప్రాంతాల్లో మాత్రం ఇంటర్నెట్ సేవలు ఉండే అవకాశాలు చాలా తక్కువ. అయితే ఇప్పుడు చాలా కంపెనీలు శాటిలైట్ ఇంటర్నెట్ పై పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ జాబితాలోకి భారతదేశ వ్యాపార వేత్త సునీల్ మిట్టల్ కూడా చేరారు.
దేశంలోని ఓ రాష్ట్రంలో 24 గంటల పాటు ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. మెసేజ్ సర్వీసులను కూడా ఆపేశారు. అసలు ఎందుకీ నిర్ణయం తీసుకున్నారు, ఏం జరిగిందంటే..!
మొజిల్లా ఫైర్ఫాక్స్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఈ బ్రౌజర్ సెక్యూరిటీ సిస్టమ్లో లోపాలు ఉన్నాయని తెలిపింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను తెలియజేస్తూ కేంద్ర ఏజెన్సీ సంస్థ సీఈఆర్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో ఏముందంటే..!
ఇంటర్నెట్.. ఒకప్పుడు నెలకు 100 ఎంబీ రీఛార్జ్ చేసుకుని జాగ్రత్తగా వాడుకునేవాళ్లు. 1990ల్లో పుట్టిన వారికి అయితే ఈ డేటా రీఛార్జ్ ల గురించి బాగా తెలుసు. ఒక ఫొటో డౌన్లోడ్ చేసుకోవాలన్నా, ఒక పాట్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా, ఒక ఫేస్ బుక్ పోస్ట్ చేయాలన్నా ఎంత సమయం పట్టేదో వారిని అడిగితే చెబుతారు. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కేవలం 2 సెక్లలనో సినిమా డౌన్లోడ్ అయిపోతోంది. అయితే ఆ వేగానికి తగినట్లుగానే మీ […]
కరోనా తర్వాత మనుషుల చేతుల్లో డబ్బు కనిపించడం చాలా వరకు తగ్గిపోయింది. కారణం.. ప్రస్తుతం ప్రతి చోటా యూపీఐ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చాయి. దాంతో పర్స్లో డబ్బులు పెట్టుకుని.. దాన్ని మర్చిపోకుండా తీసుకెళ్లే బాధ తప్పింది. బ్యాంక్ ఖాతాలో డబ్బు ఉండి.. చేతిలో ఫోన్ ఉంటే చాలు.. టీ కొట్టు మొదలు.. ఫైవ్ స్టార్ హోటల్ వరకు ఎక్కడ అయినా చెల్లింపులు చేయవచ్చు. ప్రస్తుం ప్రతి చోటా యూపీఐ పేమెంట్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే యూపీఐ పేమెంట్స్ […]
జిల్లా పేరు మార్పు నేపథ్యంలో అమలాపురంలో మంగళవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. కోనసీమ జిల్లా పేరును బీఆర్ అంబేడ్కర్ జిల్లాగా మారుస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే కోనసీమ వాసుల ఆగ్రహానికి కారణం అయ్యి.. జిల్లాను రణరంగంగా మార్చింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోనసీమ సాధన సమితి భారీ ర్యాలీకి పిలుపునిచ్చింది. వందల సంఖ్యలో జనాలు రావడంతో పరిస్థితి అదుపు తప్పి.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు లాఠీలు జుళిపిస్తే.. ప్రతిగా […]
స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాక సోషల్ మీడియా వినియోగం ఊహించని స్థాయిలో పెరిగింది. ప్రస్తుతం కాలంలో తిండి లేకపోయినా ఉంటారేమో గాని చేతిలో స్మార్ట్ ఫోన్ లేకపోతే బ్రతకలేం అంటున్నారు యువతీ యువకులు. అయితే చేతిలోకి స్మార్ట్ ఫోన్స్ వచ్చాక అబ్బాయిలు, అమ్మాయిలు ఎక్కువగా ఏ యాప్స్ చేస్తున్నారు? గూగుల్ లో ఎక్కువగా వేటికోసం వెతుకుతున్నారు? అనే సందేహాలు కలగడం సహజం. తాజాగా గూగుల్ లో అమ్మాయిలు, మహిళలు ఎక్కువగా ఏ అంశాలు సెర్చ్ చేస్తున్నారనే అంశాలపై […]
దేశంలో గత ఐదేండ్లలోనే ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య రెట్టింపు అయ్యింది. ముఖ్యంగా 4జీ నెట్వర్క్ రంగ ప్రవేశం చేసిన తర్వాత సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. 2015 నుంచి 2018 వరకు సగటున ఏటా 5 కోట్ల మంది వినియోగదారులు పెరుగగా.. ఒక్క 2019లో ఏకంగా 13.5 కోట్ల మంది పెరిగారు. 2020లోనూ సుమారు 10 కోట్ల మంది పెరిగారు. 2024 నాటికి యూజర్ల సంఖ్య 110 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు సబ్మెరైన్ ఫైబర్ […]