ఆంధ్రప్రదేశ్లో సినిమా టిక్కెట్ల ధరల పెంపు అంశానికి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 13పై ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. సినిమా టికెట్ ధరలను నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదని.. లైసెన్సింగ్ అథార్టీ(జేసీ)కి మాత్రమే ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. ఫైనల్గా సినిమా టికెట్ల ధరలను నిర్ణయించేది లైసెన్సింగ్ అథార్టీయేనని స్పష్టం చేసింది. అదేవిధంగా సినిమా టికెట్ల అమ్మకాల్లో సర్వీసు ఛార్జీ విధించే అధికారం కూడా లేదని.. ఆన్లైన్ టికెట్ మొత్తం ధరలో సర్వీసు ఛార్జీని కలపడాన్ని కోర్టు తప్పుబట్టింది. దీనిని టికెట్ ధరల్లో కలపడానికి వీల్లేదని స్పష్టచేసింది. పాత విధానంలో టికెట్లు విక్రయించుకోవచ్చని మల్టీప్లెక్స్ యాజమాన్యానికి సూచించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సూచించిన న్యాయమూర్తి.. తదుపరి విచారణ జూన్ 15వ తేదీకి వాయిదా వేశారు.
వివాదం ఏంటంటే..
మల్టీఫ్లెక్స్లు విధించే సర్వీస్ చార్జీలను సినిమా టికెట్లలో చేరుస్తూ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 7న జీవో నెంబరు 13ను జారీ చేసిన సంగతి తెలిసిందే. దానిపై థియేటర్ల యాజమాన్యాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. ఆ జీవోను, ప్రభుత్వ తీరును సవాలు చేస్తూ మల్టీఫ్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. టికెట్ల ధరలకు సంబంధించి ప్రభుత్వ జీవోపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే.. మల్టిప్లెక్సులు కల్పిస్తున్న సౌకర్యాలకు వసూలు చేసే సర్వీసు చార్జీలను టికెట్ల ధరల్లో కలపడానికి కుదరదని థియేటర్ యాజమానులు తెలిపారు.
ఇది కూడా చదవండి: అతడికి కాలే పెద్ద శాపం అయ్యింది.. ఏకంగా ప్రభుత్వ ఉద్యోగం పోయింది!తాము కల్పిస్తున్న సర్వీసులకు తగ్గట్లుగా ఛార్జీలు వసూలు చేసుకొనే వెసులుబాటు పూర్తిగా థియేటర్ల పరిధిలోనే ఉండాలని వారు వాదించారు. అంతేకాక, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో మల్టీప్లెక్స్ థియేటర్ల యాజమాన్యాలను భాగస్వాములను చేయలేదని గుర్తు చేశారు. కనీసం వారిని సంప్రదించకుండానే కమిటీ ఏర్పాటయిందని వాదనలు వినిపించారు. సాధారణ థియేటర్లతో పోల్చితే మల్టీప్లెక్స్ థియేటర్లలో విలాసవంతమైన సౌకర్యాలు ఉంటాయి కాబట్టి.. యాజమాన్యాలను సంప్రదించకుండా ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలపై ఓ ప్రభుత్వం తనకు తానే ధరలు ఖరారు చేయడం సరికాదని వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. సర్వీసు చార్జీలను టికెట్ ధరల్లో చేర్చే అధికారం ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే హైకోర్టు తాజా ఉత్తర్వులు ఇచ్చింది.
ఇది కూడా చదవండి: వామ్మో వీడి తెలివి తగలెయ్య.. విగ్గులో దాచి బంగారం స్మగ్లింగ్!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.