ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం అమ్మకాల విషయంలో చాలా మార్పులు వచ్చాయి. పాత బ్రాండ్లు పూర్తిగా బంద్ అయ్యాయని చెప్పొచ్చు. ప్రభుత్వం కొత్త బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చింది. బూమ్, బూమ్.. ప్రెసిడెంట్ మెడల్ వంటి బ్రాండ్లే ప్రస్తుతం ఏపీలో దొరుకుతున్నాయి. ఈ బ్రాండ్ల విషయంలో ఏపీ మందు ప్రియులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమ్ముతున్న బ్రాండ్లు అంత రుచిగా లేవని, నాశిరకంగా ఉన్నాయని వారు అంటున్నారు. పైగా నాశిరకం బ్రాండ్లకు అధిక ధరలు పెట్టి అమ్మటం ఏంటని వాపోతూ ఉన్నారు. కొంతమంది పక్క రాష్ట్రాల నుంచి మందు తెప్పించుకుని తాగుతున్నారు.
సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు పక్క రాష్ట్రంలో మందు తాగి వచ్చేస్తున్నారు. ఇలా ఎన్నో కష్టాలు పడుతున్న ఏపీలోని మందు బాబులకు ప్రభుత్వం శుభవార్త చెప్పబోతోందట. త్వరలో ఒరిజినల్ బ్రాండ్స్ను తీసుకురానుందట. ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్లు దాదాపు బంద్ అయ్యాయి. కేవలం క్యాష్ కొనుగోళ్లు మాత్రమే జరుగుతున్నాయి. త్వరలో ఆన్లైన్ పేమెంట్లు కూడా తీసుకువచ్చే అవకాశం ఉందట. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకోబోతోందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. లిక్కర్ విషయంలో మందు బాబుల అసంతృప్తిని పోగొట్టడానికి పాత బ్రాండ్లను తీసుకురావటానికి చూస్తోందట. ఎన్నికల ముందు పాత బ్రాండ్లను తీసుకువస్తే..
ఇప్పుడున్న అసంతృప్తి పూర్తిగా తగ్గిపోతుందని ప్రభుత్వం ఆలోచిస్తోందట. అయితే, పాత బ్రాండ్లను తీసుకురావటం వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం చాలా వరకు తగ్గిపోతుంది. ఎందుకంటే.. పాత బ్రాండ్లు చాలా వరకు బయటి రాష్ట్రాల్లో తయారు అవుతున్నవే. వీటిని తీసుకు రావటం వల్ల ప్రభుత్వానికి పెద్దగా ఆదాయం రాదు. వచ్చే ఆదాయాన్ని కాదనుకుని ప్రభుత్వం వీటిని మళ్లీ తీసుకువస్తుందా? లేదా అన్నది ఆలోచించాల్సిన విషయం. మరి, ఏపీ ప్రభుత్వం పాత బ్రాండ్లను తీసుకువచ్చే దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. మరి, ప్రభుత్వం ఒరిజినల్ బ్రాండ్స్ను తీసుకువస్తుందా? లేదా ? అన్నదానిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.