Gorantla Madhav: ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వీడియోపై ఏపీ సీఐడీ వివరణ ఇచ్చింది. టీడీపీ విడుదల చేసిన రిపోర్టులో వాస్తవాలు లేవని ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ తెలిపారు. గురువారం ఆయన మీడియా మాట్లాడుతూ.. ‘‘ ప్రైవేట్ ల్యాబ్స్ ఇచ్చే నివేదికలకు విలువ ఉండదు. మన ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చే నివేదికనే ప్రామాణికం. అది ఇద్దరి మధ్య జరిగిన వీడియో కాల్. ఆ వీడియోను మూడో వ్యక్తి షూట్ చేశాడు. ఆ వీడియో కంటెంట్ ఒరిజినలా కాదా అని ల్యాబ్ చెప్పలేదు. రిపోర్టును మార్ఫింగ్ చేసి ప్రచారం చేశారు. వీడియో తనది కాదని ఎంపీ ఫిర్యాదు చేశారు.
చట్టపరంగా చర్యలు తీసుకుంటాం’’ అని అన్నారు. గతంలో ఈ వీడియోపై అనంతపురం ఎస్పీ పక్కీరప్ప మాట్లాడుతూ.. ఆ వీడియో ఒరిజినల్ కాదన్నారు. ఓ వ్యక్తి రికార్డు చేసిన వీడియో ఇంకో వ్యక్తికి పంపగా.. అతను మొబైల్ ఫోన్లో చూస్తుండగా మరో మొబైల్లో రికార్డ్ చేయడం జరిగిందన్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారని, సోషల్ మీడియాలో వస్తున్న వీడియో ఒరిజినల్ కాదని వెల్లడించారు.
చాలాసార్లు వీడియోను ఫార్వర్డ్, రీపోస్ట్ చేయడం ద్వారా ఏది ఒరిజినల్ అన్నది నిర్ధారించలేకపోతున్నామన్నారు. అది ఒరిజినల్ కాదు కాబట్టి.. ఆ వీడియో ఎడిటింగ్ చేశారా? ఒరిజినలా? మార్ఫింగ్ చేశారా? అనే విషయాన్ని నిర్ధారించలేకపోతున్నాని పేర్కొన్నారు. మరి, టీడీపీ విడుదల చేసిన రిపోర్టులో వాస్తవాలు లేవన్న ఏపీ సీఐడీ చీఫ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : భోజనం పెట్టలేదని భార్యను కొట్టి చంపిన భర్త!