విద్యార్థుల భవిష్యత్ కు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం తరచూ కీలక నిర్ణయాలు తీసుకుంటాయి. ముఖ్యంగా పరీక్షలకు సంబంధించి, అలానే వాటి మూల్యాంకన విషయంలో పలు నిర్ణయాలు తీసుకుంటారు. అలానే ప్రభుత్వాలు తరచూ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్తుంటాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది.
విద్యార్థుల భవిష్యత్ కు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం తరచూ కీలక నిర్ణయాలు తీసుకుంటుంటాయి. ముఖ్యంగా పరీక్షలకు సంబంధించి, అలానే వాటి మూల్యాంకన విషయంలో పలు నిర్ణయాలు తీసుకుంటారు. అలానే ప్రభుత్వాలు తరచూ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్తుంటాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులు శుభవార్త చెప్పింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులకు ఎంతో మేలు జరగనుంది. మరి.. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయం ఏమిటో ఆ వివరాలు తెలుసుకుందాం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో కొందరు విద్యార్థులు నిర్ణీత ప్రశ్నల సంఖ్య కన్నా ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు రాస్తుంటారు. అలాంటి వారికి.. రాసిన వాటిల్లో ఏ ప్రశ్నకు ఎక్కువ మార్కులు వస్తే దానిని పరిగణనలోకి తీసుకుని ఆ విద్యార్థి మొత్తం మార్కులను కలపనున్నారు. అలానే తక్కువ మార్కులు వచ్చిన ప్రశ్నల జవాబులను తీసివేస్తారు. ఈ మేరకు తాజాగా పాఠశాల విద్యాశాఖ కార్యాచరణ విడుదల చేసింది. టెన్త్ పబ్లిక్ పరీక్షలు ఈ నెల 3నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే.
ఈ నెల 18వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. అనంతరం మరుసటి రోజు ఏప్రిల్ 19 నుంచి మూల్యాంకనం జరగనుంది. ఈనెల 19 నుంచి 26వ తేదీ వరకు పదో తరగతి పరీక్షల మూల్యాంకన జరగనుంది. అందుకు తగిన ఏర్పాట్లను రాష్ట్ర, జిల్లా అధికారులు చేస్తున్నారు. మూల్యాంకన ప్రక్రియాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాఠశాల విద్యాశాఖ పలు మార్గదర్శకాలతో కూడిన ప్రొసీడింగ్స్ జారీ చేశారు. మరి.. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.