సీఎం వైఎస్ జగన్ రెండేళ్ల పాలన సంబరాలు ఒక రోజు ముందుగానే మొదలయ్యాయి. ట్విట్టర్లో ‘2 ఇయర్స్ ఫర్ వైఎస్ జగన్ అనే నేను’ హ్యాష్ట్యాగ్ దేశవ్యాప్తంగా ట్రెండింగ్లో నిలిచింది. ఈ ట్రెండింగ్ ఇదే స్థాయిలో కొనసాగుతోంది. ఈ హ్యాష్ట్యాగ్ను ట్విట్టర్లో క్రియేట్ చేసిన రెండున్నర గంటల్లోనే లక్ష మందికిపైగా ట్వీట్లు చేయడం విశేషం. దాదాపు అన్ని సోషల్ మీడియాలో జై జగన్ అనే కనిపిస్తోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 151 ఎమ్మెల్యేలను గెలిపించుకుని చరిత్ర సృష్టించిన జగన్ పాలనకు సరిగ్గే నేటికి రెండేళ్లు పూర్తైంది. శనివారం (మే 29) రాత్రి పది గంటల సమయానికి ఈ హ్యాష్ట్యాగ్ దేశంలో ట్రెండింగ్లో మొదటి స్థానంలో నిలిచింది. ఇది సీఎం వైఎస్ జగన్కి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ను తెలియచేస్తోందని టెకీలు పేర్కొంటున్నారు.
సమస్యలు, విపక్షాల ఆరోపణలు ఏవైనా, సంక్షోభాలు విరుచుకుపడుతున్నా సీఎం వైయస్ జగన్ రెండేళ్ల పాలనను సాగించారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా సృష్టించిన హ్యాష్ట్యాగ్ కూడా భారీగా ట్రెండింగ్లో నిలిచింది. గతేడాది సీఎంగా మొదటి ఏడాది పూర్తి చేసుకున్నప్పుడు రూపొందించిన హ్యాష్ట్యాగ్ను 20 లక్షలకు మందికిపైగా ట్రెండింగ్ చేశారు. జగన్ సర్కారు రెండేళ్లు దిగ్విజయంగా పూర్తిచేసుకున్న నేపథ్యంలో ఆయన పాలనపై పుస్తకం రూపొందించారు. ఈ పుస్తకం ద్వారా సీఎం జగన్ రెండేళ్ల పాలనలోని అంశాలను ప్రజలకు నివేదించనున్నారు.