మంగళవారం ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి నూతన గవర్నర్ అబ్ధుల్ నజీర్ ప్రసంగించారు.
మంగళవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇటీవలే ఏపీకి గరవ్నర్ గా వచ్చిన జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ తొలి సారి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తోందని ఆయన తెలిపారు. పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. నవరత్నాలు, ఇతర అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. అవినీతికి తావులేకుండా అర్హులందరికీ నేరుగా లబ్ధి చేకూరుతోందని గవర్నర్ తెలిపారు. నాలుగేళ్లుగా సుపరిపాలన అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. దేశంలో ఎక్కడి లేని విధంగా వినూత్నంగా వాలంటీర్ వ్యవస్థ అమలు చేస్తున్నామని గవర్నర్ తెలిపారు.ప్రసంగానికి కంటే ముందు గవర్నర్ కు ఏపీ సీఎం స్వాగతం పలికారు. మంగళవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగ ముగిసిన తరువాత బీఏసీ సమావేశం జరగనుంది.
ఇంకా గవర్నర్ మాట్లాడుతూ.. “అమ్మఒడి పథకం కింద రూ. 19,671 కోట్ల ఖర్చు చేశాము. అలానే ఇప్పవటి వరకు 21.25 లక్షల గృహాలను లబ్ధిదారులకు మంజూరు చేశారు. నవరత్నాలతో సంక్షేమ పాలన అందిస్తున్నాము. పరిశ్రమలు, వ్యవసాయం, సేవా రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించాము. రాష్ట్రంలో 1.4 కోట్ల హెల్త్ కార్డులు జారీ చేశాము. 30.65 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ నాలుగేళ్ల కాలంలో బాగ మెరుగుపడింది. మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు చేసి పౌష్టికాహారం అందిస్తున్నాం. రాష్ట్రంలో కొత్తగా 17 వైద్యకళాశాలను ఏర్పాటు చేస్తున్నాము.
ప్రతి పీహెచ్ సీలలో ఇద్దరు వైద్యులు ఉండేలా చర్యలు తీసుకున్నాము. రాబోయే నాలుగేళ్లలో దశలవారీగా ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేస్తాము. ప్రతి ఇంటి స్థలం విలువ రూ.5- 10 లక్షలు ఉంది. జీఎస్డీపీలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఉన్నాం. నాడు-నేడు కింద తొలి ధశలో 15, 717 పాఠశాలలను అభివృద్ధి చేశాం. రాష్ట్రంలోని యువత ప్రపంచ స్థాయిలో పోటీపడేలా విద్యారంగంలో మార్పులు తెచ్చాం” అని తన ప్రసంగంలో గవర్నర్ తెలిపారు. మరి.. ఏపీ గవర్నర్ ప్రసంగం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.