తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో జరిగిన అమానవీయంగా ఘటన అందరిని కలచివేసింది. కన్నకొడుకు చనిపోయీ పుట్టేడు దుఃఖంలో ఉన్న ఓ వ్యక్తికి అక్కడి అబులెన్స్ డ్రైవర్లు నరకం చూపించారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారు. సాయం చేయబోయిన వేరే అబులెన్స్ డ్రైవర్ పై వారు దాడి చేశారు. దీంతో చేసేది లేక ఆ వ్యక్తి బైక్ పై కొడుకు మృతదేహాన్ని తీసుకెళ్లాడు. ఈ ఘటన రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిని కలచివేసింది. అదే తరహాలో విశాఖలో మరో ఘటన చోటుచేసుకుంది. విశాఖలోని కేజీహెచ్ లో కూడా అంబులెన్స్ మాఫీయా ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. తన భార్యను తల్లిబీడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాన్ని కాదని సొంత వాహనంలో వెళ్తున్నందుకు ఓ వ్యక్తిపై దాడి చేశారు. వివరాల్లోకి వెళ్తే..
అనకాపల్లి జిల్లా ఎస్. రాయవరం మండలం పెనుగోలు ధర్మవరం గ్రామానికి చెందిన సారిపిల్లి మనోజ్.. తన భార్య ఝాన్సీని ఈనెల ప్రసవం కోసం ఈనెల19 విశాఖలోని కేజీహెచ్ లో చేర్పించారు. ఈనెల 21న ఆమెకు ఆడబిడ్డ పుట్టింది. బాలింత కోలుకోవడంతో మంగళవారం డిశ్చార్జి చేశారు. ఆ సమయంలో మనోజ్ వద్దకు తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనం డ్రైవర్ ఒకరు వచ్చి వారి స్వగ్రామానికి తమ వాహనంలో తీసుకువెళతానని చెప్పారు. అయితే తమకు సొంత వాహనం ఉందని అందులో వెళ్తామని మనోజ్ చెప్పాడు. దీంతో అవసరమైన పత్రాలు మనోజ్ కి ఇచ్చి ఆ డ్రైవర్ వెళ్లిపోయాడు. తన భార్య, కూతురితో కలిసి తమ వాహనం వద్దకు వెళ్తుండగా మరో తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ డ్రైవరు వచ్చి మనోజ్ తో ఘర్షణకు దిగాడు.
సొంతవాహనంలో వెళ్లకూడదని అడ్డుపడ్డాడు. దీంతో మనోజ్ కూడా ఎదురు తిరిగాడు. ఇంతలో అక్కడ విధులు నిర్వహిస్తున్న కుమార్ అనే వ్యక్తి మనోజ్ కంటిపై బలంగా కొట్టాడు. దీంతో మనోజ్ ముక్కు వెంట రక్తం వచ్చింది. ఇదే సమయంలో బాలింత అయిన తన భార్యతో కూడా అక్కడి భద్రతా సిబ్బంది వాగ్వాదానికి దిగారని మనోజ్ వాపోయాడు. అక్కడ కొందరు ఓ గ్యాంగ్ గా మారి దాడులకు పాల్పడుతుందని మనోజ్ తెలిపారు. ఈ ఘటనపై ఆసుపత్రి పర్యవేక్షణ వైద్యాధికారిణి డాక్టర్ పి. మైథిలి స్పందించారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేపడతామని తెలిపారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.