ప్రభుత్వ స్కూళ్లలో టెన్త్ పాస్ అయిన విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విద్యార్థుల్లో బాగా చదవాలనే తపనను పెంచే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది.
చాలామంది కలలు కంటారు.. వాటిని నిజం చేసుకునేందుకు కృషి చేస్తుంటారు. వాటిని సాకారం చేసుకునే క్రమంలో చాలా మంది సాకులు చూపిస్తూ తప్పించుకుంటారు. కానీ, అలేఖ్య మాత్రం తన జీవితంలో ఎంతో విషాదం చూసినా ఎదిరించి నిలబడింది. తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించింది.
తెలంగాణలో ఒకవైపు ప్రశ్నపత్రాల లీకేజీలు, మరో వైపు ఆన్సర్ షీట్స్ బండిల్ మాయం ఘటనలు చోటుచేసుకున్న ఈ సమయంలో అధికారులు చేసిన ఓ చర్య వివాదాస్పదమైంది. అధికారుల నిర్లక్ష్య ధోరణితో విద్యార్థుల జీవితాలతో అగమ్యగోచరంగా తయారవుతున్నాయి.
ఎంతో కష్టపడి పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించాలని ప్రతి విద్యార్థి కోరుకుంటారు. కానీ ఈ మద్య కొంతమంది డబ్బు కోసం పేపర్ లీక్ చేసి విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారు. తెలంగాణలో తెలంగాణలో పేపర్ లీక్ వ్యవహారం పెను సంచలనాలకు దారి తీసింది. టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ రాష్ట్రంలో పెద్ద దుమారం రేపగా.. టెన్త్ పరీక్షలు జరుగుతున్న సమయంలో తెలుగు, హిందీ పరీక్షా పేపర్లు లీక్ కావడం కలకలం సృష్టించింది.
ఇటీవల కొంతకాలం నుంచి తెలంగాణ వ్యాప్తంగా పేపర్ లీకేజ్ కలకలం చోటుచేసుకుంది. టీఎప్సీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం గత కొంతకాలం రాష్ట్ర వ్యాప్తంగా పెను ప్రకంపనాలే సృష్టించింది. ఈ ఘటన విషయంలో పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే పదో తరగతి ప్రశ్నపత్రాలు లీకయ్యాయి. ఇదే సమయంలో ఓ పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
తమ బిడ్డలు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి వెళ్లాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అందుకోసం రేయింబవళ్లు కష్టపడి బిడ్డలను చదివిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు పిల్లలు తమ తల్లిదండ్రులను ఆశలకు తగినట్లుగా కష్టపడి చదివి.. ఉన్నత స్థితికి చేరుకుంటారు. అయితే కొందరి విషయంలో మాత్రం విధి చిన్న చూపు చూస్తుంది. తాజాగా విధి ఆడిన వింత నాటకానికి ఓ కుటుంబంలో విషాదం నిండింది.
తెలంగాణ, ఏపీల్లో పదో తరగతి పరీక్షలు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. విద్యార్థుల వెంట తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాలకు వచ్చారు. దీంతో అక్కడ సందడి వాతావరణం కనిపించింది. కానీ ఈ పరీక్ష వేళ ఓ విద్యార్థి ఇంట పెను విషాదం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. విద్యార్థులు, తల్లిదండ్రుల రాకతో పలు పరీక్షా కేంద్రాల వద్ద కోలాహలం నెలకొంది. అయితే ఓ విద్యార్థి మాత్రం ఏడుస్తూనే పరీక్షకు హాజరయ్యాడు. విధి అతడితో వింత నాటకం ఆడింది. వివరాల్లోకి వెళితే
ఆ బాలిక పేరు దీప్తి. ఖమ్మంలోని ఓ గురకుల పాఠశాలలో ప్రస్తుతం 10వ తరగతి చదువుతుంది. అయితే అక్కడ ఆ విద్యార్థినిని గత కొంత కాలం నుంచి వేధింపులకు గురి చేస్తున్నారు. వీరి టార్చర్ ను భరించలేకపోయిన ఆ బాలిక.. తాజాగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అసలేం జరిగిందంటే?