హైదరాబాద్ లో చిన్నారులపై వరుస అత్యాచారాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇటీవల సైదాబాద్ లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచార ఘటన మరువకముందే మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ లోని పార్శిగుట్ట ప్రాంతంలో ఓ ఏడేళ్ల చిన్నారి ఒంటరిగా కిరాణ షాపు కు వెళ్లింది.
కాపుకాసిన ఆటో డ్రైవర్ మల్లిఖార్జున్ బాలికకు చాక్లెట్ ఆశ చూపి ఆటోలో బయటకు తీసుకెళ్లాడు. ఇక దారుణంగా ఆ చిన్నారి చేతులు కట్టేసి అత్యాచారానికి ఒడిగట్టాడు. దీంతో ఆ పాప వద్దు వద్దు అని అరుస్తూ కేకలు పెట్టింది. ఇక ఆ పాప అరుపులు గమనించిన స్థానికులు నిందితుడైన మల్లిఖార్జున్ ని చితకబాదారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించటంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు.