భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. అలానే అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని కేసీఆర్ సర్కార్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించింది. ఈ వేడుకపై తెలంగాణ గవర్నర్ తమిళిసై స్పందించారు.
భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. అలానే అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ సమీపంలో కేసీఆర్ సర్కార్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించింది. ఈ వేడుకకు అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ హాజరయ్యారు. మంత్రులు, ఎమ్మెల్సీలు, పలువురు ఉన్నతాధికారుల సమక్షంలో కేసీఆర్ దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకలు ఘనంగా జరిగిన కూడా అక్కడ ఓ ప్రముఖమైన వ్యక్తి మాత్రం కనిపించలేదు. వారే తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్. ఆమె అంబేద్కర్ విగ్రహావిష్కరణలకు హాజరు కాలేదు. అయితే విషయంలో నేడు గవర్నర్ స్పందించారు. తాను రాకపోవడానికి గల కారణాలను మీడియా ముందు వెల్లడించారు.
శనివారం ఓ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ గవర్నర్ తమిళిసై మీడియాతో మాట్లాడారు. ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహావిష్కరణ ప్రోగ్రామ్ కు తనకు ఆహ్వానం రాలేదని ఆమె తెలిపారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం వచ్చి ఉంటే తప్పకుండా వెళ్లేదానినని తెలిపారు. అంబేద్కర్ దేశాభివృద్ది, మహిళ సాధికారికత,బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కోసం కృషి చేశారని అన్నారు. ఆయన చేపట్టిన సమావేశాల్లో ఎక్కువగా మహిళల హక్కుల గురించి మాట్లాడారని చెప్పారు. భారత అంబేద్కర్ విగ్రహావిష్కరణకు మహిళా గవర్నర్కు ఆహ్వానం రాకపోవడం ఆశ్చర్యంగా ఉందని ఆమె తెలిపారు. ఆ వేడుకకు ఆహ్వానం రాకపోవడంపై తాను కూడా చాలా బాధపడ్డానని తమిళిసై చెప్పారు.
అయితే తాను రాజ్భవన్లో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్కు నివాళులర్పించానని గవర్నర్ తెలియజేశారు. ఇక గత కొన్ని నెలల నుంచి తెలంగాణాల్లో ప్రగతి భవన్ వర్సెస్ రాజ్ భవన్ అన్నట్లు విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పలు విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీరుపై గవర్నర్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. గతంలో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే కొనసాగాయి. ఇదే సమయంలో మరొకవైపు తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన కొన్ని బిల్లులను గవర్నర్ పెండింగ్ లో ఉంచారు. గతకొంతకాలం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది.
మరోవైపు గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్పై బీఆర్ఎస్ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమె బీజేపీ ఏజెంట్గా వ్యవహరిస్తుందని ఆరోపణలు కూడా చేస్తున్నారు. అలానే ప్రభుత్వ నిర్వహించి కీలక కార్యక్రమాలకు గవర్నర్ ను ఆహ్వానించకుండా అవమానపరుస్తున్నారంటూ బీజేపీ శ్రేణులు సైతం కేసీఆర్ సర్కార్ పై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె తాజాగా మరోసారి రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి.. గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.