అతడో సాఫ్ట్ వేర్ ఉద్యోగి. గురువారం బక్రీద్ పండగ సందర్భంగా ఆఫీసుకి సెలవు కావడంతో ఇంటికి వెళ్లాలని అనుకున్నాడు. ఇక రైలు కూడా ఎక్కాడు. కానీ, విధి రాతతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. అసలేం జరిగిందంటే?
ఈ ఫొటోలో కనిపిస్తున్న యువకుడి పేరు శ్రీకాంత్, వయసు 25 ఏళ్లు. బాగా చదువుని హైదరాబాద్ లోని ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా రాణిస్తున్నాడు. ఇక నగరంలోనే ఉంటూ అప్పుడప్పుడు ఇంటికి వెళ్లొస్తుండేవాడు. ఇకపోతే, శ్రీకాంత్ ఎప్పటిలాగే బుధవారం కూడా ఆఫీసుకు వెళ్లాడు. గురువారం బక్రీద్ పండగ సందర్భంగా సెలవు కావడంతో ఇంటికి వెళ్లాలని అనుకున్నాడు. ఇందులో భాగంగానే శ్రీకాంత్ ఆఫీసు నుంచి త్వరగా వచ్చి ఇంటికి వెళ్లేందుకు ఓ రైలు ఎక్కాడు. కట్ చేస్తే.. పాపం, విధి రాతకు చివరికి శ్రీకాంత్ ప్రాణాలు కోల్పోయాడు. అసలేం జరిగిందంటే?
ఉమ్మడి వరంగల్ జిల్లా కమలాపూర్ మండలం నేరెళ్ల. ఇదే గ్రామానికి చెందిన శ్రీకాంత్ (25) అనే యువకుడు బాగా చదువుకుని హైదరాబాద్ లోని ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని సంపాదించాడు. జాబ్ రావడంతో అతడు నగరంలోనే ఉంటూ ఆఫీసుకు వెళ్లేవాడు. సెలవుల్లో భాగంగా శ్రీకాంత్ అప్పుడప్పడు ఇంటికి వచ్చి తల్లిదండ్రులను కలిసి వెళ్లిపోతుండేవాడు. ఇక గురువారం బక్రీద్ పండగ సందర్భంగా సెలవు ఉండడంతో అతడు ఇంటికి వెళ్లాలని భావించాడు. దీంతో బుధవారం సాయంత్రమే వరంగల్ వెళ్లడానికి శాతవాహన ఎక్స్ ప్రెస్ ఎక్కాడు. రైళ్లో రద్దీగా ఉండడంతో రైలు ఫుట్ బోర్డుపై నిలబడ్డాడు. అయితే, ఆ ఎక్స్ ప్రెస్ బీబీనగర్ వద్దకు రాగానే ఓ గుర్తు తెలియని వ్యక్తి శ్రీకాంత్ చేతిలో సెల్ ఫోన్ ఉన్నది గమనించాడు.
ఎలాగైనా ఆ సెల్ ఫోన్ ను దొంగిలించాలని అనుకున్నాడు. ఇందులో భాగంగానే ఆ వ్యక్తి కర్రతో కొట్టాడు. దీంతో సెల్ ఫోన్ కిందపడింది. ఇక ఆ ఫోన్ కాపాడుకునే ప్రయత్నంలో శ్రీకాంత్ రైలు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. వాహనదారులు గమనించి అతడిని బయటకు తీయగా అతడు అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు మృతుడి వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత మృతదేహాన్ని అతని స్వగ్రామానికి తరలించారు. కొడుకు శవమై ఇంటికి తిరిగి రావడంతో అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో వారి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ వార్త చదివిన కొందరు.. వీధి ఎంత విచిత్రమైందో చూడండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.