ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ ఎడిటర్ తుది శ్వాస విడిచారు.
ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ ఎడిటర్ మృతి చెందారు. సీనియర్ ఎడిటర్ గా ఎన్నో సినిమాలకు పనిచేసిన పి. వెంకటేశ్వర రావు (72) ఇక లేరు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఎన్నో గొప్ప చిత్రాలకు ఎడిటర్ గా పని చేశారు. యుగంధర్, మొండి మొగుడు పెంకి పెళ్ళాం, కెప్టెన్ కృష్ణ, ఇద్దరు అసాధ్యులు, ముద్దాయి వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ఎడిటర్ గా పని చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 200కు పైగా సినిమాలకు ఈయన ఎడిటర్ గా పని చేశారు.
అంతేకాదు డీఎంకే పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, ప్రముఖ దర్శకుడు కేఎస్ఆర్ దాసు, పి. వాసు, మంగిమందన్, వై నాగేశ్వర్ రావు, బోయిన్ సుబ్బారావు వంటి ప్రముఖ దర్శకులతో పని చేశారు. ఈయన ప్రముఖ దర్శకుడు కేఎస్ఆర్ దాసు గారి మేనల్లుడు. ఎన్నో చిత్రాల ఘన విజయాల్లో కీలక పాత్ర పోషించిన వెంకటేశ్వరరావు ఇక లేరని తెలిసి పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన పార్థివ దేహానికి ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. 22వ తేదీన అనగా గురువారం నాడు చెన్నైలో దహన సంస్కారం చేయనున్నారు. ఆయనకు సద్గతులు ప్రాప్తించాలని భగవంతుడ్ని కోరుకుందాం.