హైదరాబాద్ నగరంలో వ్యభిచారా గృహాలపైన పోలీసులు ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తుంటారు. పట్టుపడిన యువతులకు కౌన్సిలింగ్ ఇవ్వడం, నిర్వహకులపై కేసుల నమోదు చేసి జైలుకు పంపడం వంటి అనేక చర్యలు తీసుకుంటున్నారు. అయిన కూడా నగరంలో అనేక చోట్ల కొందరు ముఠా వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని ఓ ప్రాంతంలో అపార్టుమెంట్లో కొందరు గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పంజగుట్ట పోలీసులు దాడిచేసి నిర్వాహకుడు, విటుడు, వీరికి సహకరించే వాచ్మెన్ను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బీఎస్ మక్తాలోని ఓ అపార్ట్ మెంట్ లో ఓ ముఠా.. కొందరి యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. అయితే ఆ అపార్టమెంట్ లో ని ప్లాట్ లో వ్యభిచారం జరుగుతుందనే పక్కా సమాచారంతో పంజాగుట్ట క్రైమ్ ఇన్ స్పెక్టర్ నరసింహరాజు, తమ సిబ్బందితో అకస్మిక దాడులు చేశారు. ఇందులో సహ నిర్వహుకుడు బీఎస్ మక్తాకు చెందిన దుర్గాప్రసాద్(26), విటుడు శేరిలింగపల్లికి చెందిన షేక్ తాహేర్(28) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వ్యభిచార నిర్వహణ సహకరిస్తున్న వాచ్ మెన్ చంద్రయ్యను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.4 వేలు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ తనీఖీలు పట్టుహబడిన వెస్ట్ బెంగాల్ కు చెందిన మహిళలను రెస్క్యూ హోం కి తరలించారు. ఈ వ్యభిచార గృహ ప్రధాన నిర్వహకుడు అమర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.