పై పోటోలు కనిపిస్తున్న మహిళ పేరు దేవి. ఆమెకు ముగ్గురు పిల్లలు. కూలీ పనులు చేసుకుంటూ భర్త, పిల్లలతో కలిసి ఎంతో సంతోషంగా జీవిస్తోంది. అయితే విధి ఆడిన వింతనాటకంలో పిల్లలను అనాథలను చేస్తూ ఆ దంపతులిద్దరు తిరిగి రాని లోకాలకు వెళ్లారు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పిల్లలను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి పనికి వెళ్లిన దేవి దంపతులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. రోడ్డు ప్రమాదాల కారణం ఇప్పటికే అనేక కుటుంబాలు వీధిన పడ్డాయి. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యం తాగి వాహనం నడపడం వంటి కారణాలతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వారి చేసిన చిన్న నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలే పోగొట్టుకున్నారు. పనుల నిమిత్తం బయటకి వెళ్లిన దేవి, ఆమె భర్తలు విగతజీవులుగా ఇంటికి తిరిగి వచ్చారు. ఈ విషాధకరమైన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
సూర్యాపేట జిల్లా మోతె మండలం రాపురం తండాకు చెందిన రమేష్(26), దేవి(24) భార్యాభర్తలు. గుట్టలపై రాళ్లు కొట్టుకుని జీవనోపాధి పొందే నిరుపేద కుటుంబం వారిది. ఆ దంపతులకి లోకేష్(5), అమూల్య(3), దని(1) అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. బతుకు దెరువు కోసం సుమారు ఎనిదేళ్ల క్రితం రాంపురం తండాకు వచ్చి.. పూరి గుడిసెను నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. హుస్సేనబాద్ గ్రామ సమీపంలోని గుట్టపై రాళ్లు కొట్టే పనికి బుధవారం బయలు దేరారు. అయితే ఆ గుట్టపైకి వెళ్లాలంటే చుట్టు తిరిగి నాలుగు కిలోమీటర్ల ప్రయాణించాలి. దగ్గరి దారిగా చేరుకునేందుకు బైక్ పై జాతీయ రహదారిపై వ్యతిరేక దిశలో డివైడర్ వెంబడి వెళ్తున్నారు. మోతె మండలంలోని మామిళ్ల గూడెం విద్యుత్తు ఉపకేంద్రం సమీపంలోకి వచ్చే సరికి వీరి బైక్ ను ఖమ్మం వైపు వెళ్తున్న కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రమేష్ అక్కడిక్కడే చనిపోగా.. వెనక కూర్చున్న దేవికి తీవ్ర గాయాలయ్యాయి.
చికిత్స నిమిత్తం ఖమ్మం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయింది. వీరిని ఢీ కొట్టిన కారులో భార్యాభర్తలు ప్రయాణిస్తున్నారు. ప్రమాద సమయంలో కారులోని ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో వారికి పెద్దగా గాయాలు కాలేదు. రమేష్ మృతదేహాన్ని సూర్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి, దేవి మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మృతుడి తల్లి వెంకటమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి.. వెళ్లిన కొడుకు కోడలు.. నిర్జీవంగా ఇంటికి రావడంతో వెంకటమ్మ గుండెలు పగిలేలా రోధించారు. తల్లిదండ్రుల మృతితో అభశభం తెలియని ఆ పసి పిల్లలు అనాథలుగా మారారు. తల్లిదండ్రులకు ఏమైందో తెలియక ఎంతో అమాయకంగా వారి కోసం ఎదురు చూస్తున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.