గత కొంతకాలంగా తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ ఏపీకి వెళ్లాలా? తెలంగాణలో ఉండాలా? అన్న విషయంపై హైకోర్టులో వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే విచారణ చేపట్టిన హైకోర్టు మంగళవారం తాజాగా తన తీర్పును వెలువరించింది. గతంలో కేంద్ర పరిపాలనా ట్రిబ్యూనల్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు తాజాగా కొట్టివేసింది. సోమేశ్ కుమార్ తెలంగాణ క్యాడర్ లో కొనసాగడానికి వీలులేదని, ఆయన తిరిగి ఏపీ కేడర్ కు వెళ్లిపోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
సోమేశ్ కుమార్ ప్రస్తుతం తెలంగాణ సీఎస్ గా కొనసాగుతున్నారు. అయితే ఇక నుంచి ఆయన ఆ క్యాడర్ లో కొనసాగేందుకు వీలు లేదని తెలంగాణ హైకోర్ట్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అయితే గతంలో సోమేశ్ కుమార్ ను ఏపీ కేడర్ కు కేటాయించింది. అయితే అప్పుడు కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ నుంచి తెలంగాణలోనే కొనసాగేందుకు ఉత్తర్వులు తెచ్చుకున్నారు సోమేశ్ కుమార్. ఈ విషయంపై విచారణ చేపట్టిన హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం.. తాజాగా క్యాట్ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేస్తూ.. తన తీర్పును వెల్లడించింది. అయితే 2017లోనే కేంద్ర ప్రభుత్వం క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టి వేయాలని హైకోర్టును ఆశ్రయించింది. అయితే సోమేశ్ కుమార్ సేవలు తెలంగాణకు అవసరం అని భావిస్తే.. ఏపీ అనుమతి తీసుకుని డిప్యూటేషన్ పై కొనసాగించుకోవాలని సూచించింది. ఇక తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పును మూడు వారాల పాటు నిలిపివేయాలని సోమేశ్ తరపున న్యాయవాది హైకోర్టును కోరగా.. అందుకు అంగీకారం తెలిపింది. హైకోర్టు తీర్పు ప్రకారం సోమేశ్ కుమార్ ఏపీకి వెళ్తారా? లేదా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. సుప్రీం కోర్టుకు వెళ్తారా? అనే విషయం తెలియాలి అంటే మరో మూడు వారాలు వేచిచూడాలి.