గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలో భారీ వర్షాల కురుస్తున్నాయి. అంతే కాక ఎగువన కురిసిన వర్షాలకు గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. ఈక్రమంలో తెలంగాణాలోని అనేక ప్రాంతాలు వరద నీటితో నిండిపోయాయి. వరద బాధితులను ప్రజాప్రతినిధులు పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఏటూరునాగారం మండలంలోని ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు శనివారం నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు ఎమ్మెల్యే సీతక్క వెళ్లారు. ఈక్రమంలో ఆమెకు పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే…
ఇటీవల కురిసిన భారీ వర్షాలలకు తెలంగాణ రాష్ట్రంలోని అనేక గ్రామాలు వరద నీటితో నిండిపోయాయి. వరద బాధితుల సహాయం కోసం అధికారులు, ఆర్మీ ఎన్డీఆర్ ఎఫ్ బృందం రంగంలోకి దిగింది. అనేక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు వరద గుప్పిట్లో చిక్కుకున్న గ్రామాల్లోని బాధితులు బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు. దీంతో వరద బాధితులకు తాము అండగా ఉన్నామంటూ.. ప్రజా ప్రతినిధులు భరోసా ఇస్తున్నారు. బాధితగ్రామాల్లోని ప్రజల దగ్గరకు బోట్ల లో వెళ్లి పరామర్శిస్తున్నారు. తాము అండగా ఉన్నామంటూ దైర్యం చెబుతున్నారు. ఈ క్రమం శనివారం ములుగు ఎమ్మెల్యే సీతక్క ఏటూరు నాగరం మండలంలోని ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు నిత్యవసర సరుకు పంపిణీ చేసేందుకు వెళ్లారు.
అక్కడ ప్రజలు సరకులు పంపిణీ చేసి.. సీతక్క తిరుప్రయాణంలో ఎలిశెట్టి వాగులో బోటుపై వస్తుండాగా.. అందులో ఇంధనం అయిపోయింది. దీంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండగా పడవ కొట్టుకొచ్చి చెట్టును గుద్దుకుని ఆగిపోయింది. దీంతో సీతక్కతో పాటు పడవలో ఉన్న వారంతా క్షేమంగా ఒడ్డుకు చేరారు. ఎవరికి ఏమీ కాకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.