ఇటీవల సెలబ్రెటీలు, రాజకీయ నేతలు, సీనియర్ అధికారుల ఇంట విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ కుటుంబంలో విషాదం నెలకొంది. ప్రస్తుత ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తున్నారు. సోమేశ్కుమార్ తల్లి మీనాక్షి సింగ్ కన్నుమూశారు. ఆమె వయసు 85 సంవత్సరాలు. కొంత కాలంగా ఆమె తీవ్ర అనారోగ్యంతో భాదపడుతున్నారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మీనాక్షిసింగ్ కన్నుమూశారు. ఆమె సొంతూరు పాట్నాలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పార్థివ దేహాన్ని హైదరాబాద్ నుంచి తరలించనున్నారు.
సోమేశ్ కుమార్ తల్లి మీనాక్షి సింగ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఫోన్ లో ఆయనను పరామర్శించారు. ఇక మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహా పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు స్వయంగా వెళ్లి ఏఐజీ ఆస్పత్రిలో పరామర్శించారు. మంత్రులతోపాటు పలు రాజకీయ పార్టీల నేతలు, అధికారులు సోమేశ్ కుటుంబానికి సానుభూతి తెలిపారు.