తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా ఆయనకు పంటి సమస్య ఉండటంతో ఢిల్లీలో చికిత్స చేయంచుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చికిత్స చేయించుకునేందుకు బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు.. ఆయన సతీమణి శోభ సైతం వెళ్లనున్నారు.
ఇటీవల ఆయనకు పంటి నొప్పి కారణంగా ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే మళ్లీ పంటి నొప్పి తీవ్రం కావడంతో కేసీఆర్ మరోసారి ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీలో ఆయన చికిత్స అనంతరం ధాన్యం కొనుగులుపై కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ని కలిసే అవకాశం ఉంది. ఈ విషయంపై మోదీతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఆ మద్య బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలంతా సమావేశం కావాలని మమత బెనర్జీ ఇచ్చిన పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.