ఎంసీఏ చదువకుకుని ఆ తర్వాత చోటచేసుకున్న సంఘటనలతో బిచ్చగాడిగా మారిన ప్రమోద్ ను సుమన్ టీవీ చేరదీసింది. పది రోజుల్లోనే తన జీవితాన్ని మార్చిన సుమన్ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు.
ఇటీవల సుమన్ టీవీ ఓ సాఫ్ట్ వేర్ బిచ్చగాడిని చేరదీసి అతడిని మళ్లీ మామూలు మనిషిని చేసిన తీరు ప్రతిఒక్కరిని ఆలోచింపజేస్తుంది. అయిన వారే ఆదరించని ఈరోజుల్లో మానవతా దృక్పథంతో ఆలోచించి అభాగ్యులను, నిరుపేదలను, కష్టాల్లో ఉన్నవారిని చేరదీసి వారికి మరో కొత్త జీవితాన్ని అందిస్తున్న సుమన్ టీవీ యాజమాన్యంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ క్రమంలో గత పది రోజుల క్రితం మాధాపూర్ ఏరియాలో ఉన్నత చదువులు చదివి బిచ్చగాడిగా తిరుగుతూ ఫుట్ పాత్ లపై జీవనం గడుపుతున్న ప్రమోద్ అనే వ్యక్తిని సుమన్ టీవీ చేరదీసింది. తన ధీన స్థితిని తెలుసుకున్న సుమన్ టీవీ అతడికి మళ్లీ న్యూ లైఫ్ ఇవ్వాలని ఆలోచించి అతడి కడుపు నింపి, బట్టలు అందించి మాతృదేవోభవ అనే ఆశ్రమంలో చేర్పించారు.
కాగా ఆశ్రమంలో ఆశ్రయం పొందిన ప్రమోద్ పదిరోజుల్లోనే మామూలు స్థితికి చేరుకున్నాడు. తనను ఆదరించిన సుమన్ టీవీకి ధన్యవాదాలు తెలిపాడు. స్వలాభం కోసం ఆలోచించే ఈ రోజుల్లో ఎలాంటి లాభాపేక్షలేకుండా మాలాంటి వారిని ఆదుకుంటున్నందుకు సుమన్ టీవీకి రుణపడి ఉంటానని తెలిపాడు. ఎవ్వరు చేయలేని గొప్ప సామాజిక కార్యక్రమాలను సుమన్ టీవీ చేపడుతోందని, తనకు జీవితమే లేదనుకున్న తరుణంలో తనను ఆదరించి పది రోజుల్లో నాజీవితాన్ని మార్చేసిన సుమన్ టీవీకి చేతులెత్తి మొక్కుతున్నానని ప్రమోద్ తెలిపాడు. మానవతా విలువలు, హెల్పింగ్ నేచర్, సమానత్వంతో కూడిన విలువలతో చరిత్రలో ఏ టీవీ ఛానల్ చేయని సామాజిక సేవా కార్యక్రమాలను సుమన్ టీవీ చేస్తోందని ప్రమోద్ వెల్లడించాడు.
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ప్రమోద్ అనే వ్యక్తి ఎంసీఏ చదివి ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్న క్రమంలో తన జీవితంలో జరిగిన సంఘటనల వల్ల మానసికంగా కుంగిపోయి ఉద్యోగాన్ని పోగొట్టుకుని రోడ్డున పడ్డాడు. హైదరాబాద్ నగరంలోని మాధాపూర్ లో బిచ్చమెత్తుకుంటూ ధీన స్తితిలో జీవితాన్ని గడిపాడు. అతడి గురించి సమాచారం తెలుసుకున్న సుమన్ టీవీ యాంకర్ నిరుపమ ప్రమోద్ ను ఆదరించి ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా ప్రమోద్ మాట్లాడుతూ.. తల్లి మరణంతో కుంగిపోయి, ఉద్యోగాన్ని కోల్పోయి రోడ్డున పడ్డానని తెలిపాడు. తనకు తోడబుట్టిన అన్నదమ్ములు ఉన్నప్పటికి ఎవరు పట్టించుకోలేదని చెప్పాడు. తనకు సహాయం చేయాల్సిందిగా యాంకర్ నిరుపమను కోరగా.. అందుకు సుమన్ టీవీ యాంకర్ ప్రమోద్ ను చేరదీసి తనకు కావాల్సిన వస్తువులను ఇప్పించి దగ్గరుండి మాతృదేవోభవ ఆశ్రమంలో చేర్పించారు. కాగా పదిరోజుల్లోనే మామూలు స్థితికి చేరుకున్న ప్రమోద్ సుమన్ టీవీ చేసిన సాయానికి ధన్యవాదాలు తెలిపాడు.