ఈ మద్య చాలా మంది ఏ వస్తువు కొనాలన్నా ఎక్కువ శాతం ఆన్ లైన్ కే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆన్ లైన్ యాప్స్ లో ఆర్డర్ కి సంబంధించిన క్లిక్ బటన్ నొక్కితే చాలు వస్తువు ఇంటి వద్దకే వచ్చేస్తుంది. కొన్నిసార్లు మనం ఆన్ లైన్ విషయంలో మోసపోతుంటాం. ఆర్డర్ ఒకటి అయితే వచ్చేది మరొకటి. అప్పుడప్పుడు మనం సెల్ ఫోన్ ఆర్డర్ చేస్తే సబ్బులు, రాళ్లు, గడ్డి రావడం చూస్తుంటాం.. ఇలాంటి ఘటనలు చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయి. అచ్చం ఇలాంటి ఘటన ఆదిలాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి దారుణంగా మోసపోయాడు.. తాను సెల్ ఫోన్ కోసం అని ఆర్డర్ చేస్తే సబ్బు బిల్ల వచ్చింది. వివరాల్లోకి వెళితే..
ఉట్నూర్ లో భీమన్న అన్న ఓ వ్యక్తి ఆన్ లైన్ లో ఓ సెల్ ఫోన్ చూశాడు.. అది తన ఫ్రెండ్స్ కి కూడా చూపించాడు. అందరూ ఆ సెల్ ఫోన్ బాగుందని.. ఫీచర్స్ కూడా బాగున్నాయని చెప్పడంతో వెంటనే ఈ-కామర్స్ సైట్లో ఆర్డర్ చేశారు. ఇక ఆర్డర్ రానే వచ్చింది.. భీమన్న కొత్త సెల్ ఫోన్ వచ్చిందని తెగ మురిసిపోయాడు.. పార్శిల్ తెరిచి చూసి ఖంగు తిన్నాడు. తనకు వచ్చిన పార్శిల్ లో సెల్ ఫోన్ రాలేదు.. దానికి బదులుగా ఓ రిన్ సబ్బు వచ్చింది. దీంతో తాను దారుణంగా మోసపోయానని గ్రహించిన భీమన్న ముందుగానే పార్శిల్ తెరిచే సమయంలో వీడియో రికార్డు చేశాడు.
ఇది చదవండి: Nayanthara: పెళ్లి తర్వాత కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టనున్న నయనతార..?
జరిగిన విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కంపెనీ యజమానులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ-కామర్స్ సైట్లో ఏవైనా ఆర్డర్ చేస్తే పార్శిల్ ఓపెన్ చేసే ముందు దాన్నిరికార్డు చేయడం మంచిదని అంటున్నారు నెటిజన్లు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.